ETV Bharat / sitara

తిరిగిరాని లోకాలకు బాలు.. శోకసంద్రంలో ప్రజానీకం

author img

By

Published : Sep 25, 2020, 9:42 PM IST

Updated : Sep 25, 2020, 9:49 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో శనివారం ఉదయం జరగనున్నాయి.

sp balu overall story
sp balu story

అమృతతుల్య గాత్రంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుముశారు. దేశవ్యాప్తంగా అశేష అభిమానులకు వేలాది పాటలను, అద్భుతమైన తన గానాన్ని గుర్తులుగా మిగిల్చి దివికేగారు.

ఆగస్టు 5న ఎంజీఎం ఆసుత్రిలో చేరారు బాలు. జలుబు, జ్వరంగా ఉండటం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ సోకినట్లు తేలింది. దీంతో స్వయంగా వీడియోను విడుదల చేశారు. ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.

తర్వాత కొద్ది రోజులకే పరిస్థితి విషమం కావడం వల్ల ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌.. తండ్రి కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వెంటిలేటర్‌ సహా ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

బాలు కోలుకోవాలని సినీదిగ్గజాలు పిలుపునివ్వడం వల్ల ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థనలు నిర్వహించారు. బాలు పాడిన పాటలు ఆలపించి ఆయన కోలుకోవాలని అభిలాషించారు. తర్వాత బాలుకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.

సెప్టెంబరు 7న చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు చరణ్ ప్రకటించారు. నాన్న క్రమంగా కోలుకుంటున్నారని, కూర్చోగలుగుతున్నారని చెప్పారు. త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈనెల 24న

విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అకస్మాత్తుగా బాలు ఆరోగ్యం విషమించిందని వెంటిలేటర్‌, ఎక్మోపైనే నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తోందని ఎంజీఎం తెలిపింది.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

వెంటనే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. బాలు కోలుకుంటారని తాను చెప్పలేనన్న కమల్‌.. ఆయన కోసం అంతా ప్రార్థించాలని కోరారు.

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడ వల్ల వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఎస్పీ బాలు శరీరం సహకరించలేదు.

అద్భుతమైన గాత్రంతో ఎన్నో మనసులను కదిలించిన ఎస్పీబీ హృదయం. ఆగిపోయిందని ఎంజీఎం ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.

అనంతరం ఎంజీఎం ఆస్పత్రి నుంచి చెన్నైలోని కోడంబాక్కంలోని బాలసుబ్రమణ్యం ఇంటికి భౌతికకాయాన్ని తరలించారు. వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి వెళ్లి కడసారి దర్శించుకుంటున్నారు. చెన్నైలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

ఇవీ చదవండి:

అమృతతుల్య గాత్రంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుముశారు. దేశవ్యాప్తంగా అశేష అభిమానులకు వేలాది పాటలను, అద్భుతమైన తన గానాన్ని గుర్తులుగా మిగిల్చి దివికేగారు.

ఆగస్టు 5న ఎంజీఎం ఆసుత్రిలో చేరారు బాలు. జలుబు, జ్వరంగా ఉండటం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ సోకినట్లు తేలింది. దీంతో స్వయంగా వీడియోను విడుదల చేశారు. ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.

తర్వాత కొద్ది రోజులకే పరిస్థితి విషమం కావడం వల్ల ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌.. తండ్రి కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వెంటిలేటర్‌ సహా ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

బాలు కోలుకోవాలని సినీదిగ్గజాలు పిలుపునివ్వడం వల్ల ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థనలు నిర్వహించారు. బాలు పాడిన పాటలు ఆలపించి ఆయన కోలుకోవాలని అభిలాషించారు. తర్వాత బాలుకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.

సెప్టెంబరు 7న చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు చరణ్ ప్రకటించారు. నాన్న క్రమంగా కోలుకుంటున్నారని, కూర్చోగలుగుతున్నారని చెప్పారు. త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈనెల 24న

విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అకస్మాత్తుగా బాలు ఆరోగ్యం విషమించిందని వెంటిలేటర్‌, ఎక్మోపైనే నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తోందని ఎంజీఎం తెలిపింది.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

వెంటనే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. బాలు కోలుకుంటారని తాను చెప్పలేనన్న కమల్‌.. ఆయన కోసం అంతా ప్రార్థించాలని కోరారు.

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడ వల్ల వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఎస్పీ బాలు శరీరం సహకరించలేదు.

అద్భుతమైన గాత్రంతో ఎన్నో మనసులను కదిలించిన ఎస్పీబీ హృదయం. ఆగిపోయిందని ఎంజీఎం ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.

అనంతరం ఎంజీఎం ఆస్పత్రి నుంచి చెన్నైలోని కోడంబాక్కంలోని బాలసుబ్రమణ్యం ఇంటికి భౌతికకాయాన్ని తరలించారు. వేలాది మంది అభిమానులు ఆయన నివాసానికి వెళ్లి కడసారి దర్శించుకుంటున్నారు. చెన్నైలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.

sp balu
ఎస్పీ బాలసుబ్రమణ్యం

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.