ETV Bharat / sitara

400 పేద కుటుంబాలకు అండగా సోనూసూద్

author img

By

Published : Jul 13, 2020, 1:56 PM IST

కరోనాతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న 400 పేద కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు నటుడు సోనూసూద్. ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారి చిరునామాలు, బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు.

Sonu Sood
సోనూసూద్

లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికుల క్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 400 పేద కుటంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు​. ముఖ్యంగా వలసకార్మికులను ఆదుకుంటానని తెలిపారు.

ఉత్తరప్రదేశ్​, బిహార్​, ఝార్ఖండ్​ సహా మిగతా రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వారి నుంచి వలస కార్మికుల చిరునామాలు, బ్యాంక్​ ఖాతాల వివరాలు సేకరించే ప్రక్రియలో ఉన్నారు సోనూ.

ఇప్పటికే వేలాది మంది కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు సోనూసూద్​. గతనెల ఏకంగా ఓ విమానం ద్వారా 300మంది కూలీలను వారి ఇళ్లకు చేర్చారు.

ఇది చూడండి : 'పెళ్లికి ఇదే సరైన సమయం.. ఖర్చు అక్కర్లేదు'

లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికుల క్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 400 పేద కుటంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు​. ముఖ్యంగా వలసకార్మికులను ఆదుకుంటానని తెలిపారు.

ఉత్తరప్రదేశ్​, బిహార్​, ఝార్ఖండ్​ సహా మిగతా రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వారి నుంచి వలస కార్మికుల చిరునామాలు, బ్యాంక్​ ఖాతాల వివరాలు సేకరించే ప్రక్రియలో ఉన్నారు సోనూ.

ఇప్పటికే వేలాది మంది కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు సోనూసూద్​. గతనెల ఏకంగా ఓ విమానం ద్వారా 300మంది కూలీలను వారి ఇళ్లకు చేర్చారు.

ఇది చూడండి : 'పెళ్లికి ఇదే సరైన సమయం.. ఖర్చు అక్కర్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.