టాలీవుడ్లోని మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈయన కంటే ముందు తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకులు రాజమౌళి, తేజ, సింగర్ స్మితతో పాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే నిర్మాత పోకూరి రామారావు ఈ వైరస్ వల్లే మరణించారు.