ETV Bharat / sitara

కారుణ్య 'సామజవరగమన మాషప్.. మీరూ వినేయండి

author img

By

Published : Jan 26, 2020, 4:56 PM IST

Updated : Feb 25, 2020, 4:54 PM IST

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ చిత్రంలో 'సామజవరగమన' పాటకూ యూట్యూబ్​లో భారీ స్థాయిలోనే బ్రహ్మరథం పట్టారు నెటిజన్లు. అలాంటి ఈ సాంగ్​ను తాజాగా మాషప్​ చేశాడు గాయకుడు కారుణ్య. ఇది కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Samajavaragamana Mashup
త్యాగరాజ సామజవరగమనా.. మళ్లీ రికార్డుల పరమా..?

అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే రూ. 220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బన్నీ కెరీర్​లో ఇది ఆల్​టైమ్​ రికార్డుగా నిలిచింది. ఈ సినిమాలోని 'సామజవరగమన' పాట మూవీ విడుదల కాకముందే సంగీత ప్రియుల మనసు దోచింది. తాజాగా ఇదే పాటను వినూత్నంగా త్యాగరాజు కీర్తనల మాదిరిగా మాషప్​ చేసి పాడాడు సింగర్​ కారుణ్య. ఇదీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

అత్యధిక మంది లైక్‌ చేసిన పాట ఇదే...

'సామజవరగమన' పాట యూట్యూబ్‌లో అత్యధిక మంది లైక్‌ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. ఇప్పటికే కోటి 20 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. 14 కోట్ల మందికి పైగా వీడియోను వీక్షించారు. తమన్‌ సంగీతం, సిధ్‌ శ్రీరామ్‌ స్వరం, సీతారామశాస్త్రి లిరిక్స్​ ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. ఈ పాట హిట్టవడం వల్ల ఫిమేల్​ కవర్​ రూపంలో గాయని శ్రేయాఘోషల్​తోనూ పాడించి విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను 54 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సీనియర్‌ నటి టబు ఈ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. సుశాంత్, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి... ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?

అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే రూ. 220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బన్నీ కెరీర్​లో ఇది ఆల్​టైమ్​ రికార్డుగా నిలిచింది. ఈ సినిమాలోని 'సామజవరగమన' పాట మూవీ విడుదల కాకముందే సంగీత ప్రియుల మనసు దోచింది. తాజాగా ఇదే పాటను వినూత్నంగా త్యాగరాజు కీర్తనల మాదిరిగా మాషప్​ చేసి పాడాడు సింగర్​ కారుణ్య. ఇదీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

అత్యధిక మంది లైక్‌ చేసిన పాట ఇదే...

'సామజవరగమన' పాట యూట్యూబ్‌లో అత్యధిక మంది లైక్‌ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. ఇప్పటికే కోటి 20 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. 14 కోట్ల మందికి పైగా వీడియోను వీక్షించారు. తమన్‌ సంగీతం, సిధ్‌ శ్రీరామ్‌ స్వరం, సీతారామశాస్త్రి లిరిక్స్​ ఈ గీతానికి ప్రధాన బలమయ్యాయి. ఈ పాట హిట్టవడం వల్ల ఫిమేల్​ కవర్​ రూపంలో గాయని శ్రేయాఘోషల్​తోనూ పాడించి విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను 54 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సీనియర్‌ నటి టబు ఈ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. సుశాంత్, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి... ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?

New Delhi, Jan 26 (ANI): Women bikers of Central Reserve Police Force named as 'CRPF Women Daredevils' showcased their daring stunts at India's 71st Republic Day parade. Leading the Daredevils was Inspector Seema Nag, who was seen saluting while standing atop of a moving motorcycle.


Last Updated : Feb 25, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.