ETV Bharat / sitara

సుశాంత్​ సోదరి ప్రియాంకపై రియా కేసు

author img

By

Published : Sep 7, 2020, 5:51 PM IST

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి.. సుశాంత్​ రాజ్​పుత్ సోదరి ప్రియాంకా సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటుడి కేసుకు సంబంధించి నకిలీ మెడికల్​ ప్రిస్క్రిప్షన్​లను సృష్టించారన్న కారణంతో కేసు పెట్టింది.

Rhea
రియా

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ రాజ్​పుత్ సోదరి ప్రియాంకా సింగ్​పై నటి రియా చక్రవర్తి కేసు నమోదు చేసింది. సుశాంత్​ కేసులో నకిలీ మెడికల్​ ప్రిస్క్రిప్షన్​లను సృష్టించినందుకు ప్రియాంకతో సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియా తరఫున న్యాయవాది మాన్​షిండే ఈ విషయాన్ని తెలిపారు.

"ఎన్​డీపీఎస్​ యాక్ట్​, టెలి మెడిసిన్​ ప్రాక్టీస్​ గైడ్​లైన్స్-2020 కింద ఫోర్జరీ నేరాలకు పాల్పడినందుకు ప్రియాంకా సింగ్​, డాక్టర్​ తరుణ్​ కుమార్​, తదితరులపై రియా ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుశాంత్​ను ఔట్ పేషెంట్​గా చిత్రీకరించేందుకు బోగస్​ మెడికల్​ ప్రిస్క్రిప్షన్​ను సృష్టించారు."

-మాన్​షిండే, రియా తరఫున లాయర్​

కాగా సుశాంత్​ మృతిపై డ్రగ్​ కనెక్షన్​ కోణంలో సాగుతున్న దర్యాప్తులో.. రియా వరుసగా రెండో రోజు ఎన్​సీబీ ముందు హాజరైంది. ఆదివారం మొదటి సారి విచారణ జరగ్గా.. సుమారు ఆరు గంటల పాటు రియాను అధికారులు ప్రశ్నించారు.

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ రాజ్​పుత్ సోదరి ప్రియాంకా సింగ్​పై నటి రియా చక్రవర్తి కేసు నమోదు చేసింది. సుశాంత్​ కేసులో నకిలీ మెడికల్​ ప్రిస్క్రిప్షన్​లను సృష్టించినందుకు ప్రియాంకతో సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియా తరఫున న్యాయవాది మాన్​షిండే ఈ విషయాన్ని తెలిపారు.

"ఎన్​డీపీఎస్​ యాక్ట్​, టెలి మెడిసిన్​ ప్రాక్టీస్​ గైడ్​లైన్స్-2020 కింద ఫోర్జరీ నేరాలకు పాల్పడినందుకు ప్రియాంకా సింగ్​, డాక్టర్​ తరుణ్​ కుమార్​, తదితరులపై రియా ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుశాంత్​ను ఔట్ పేషెంట్​గా చిత్రీకరించేందుకు బోగస్​ మెడికల్​ ప్రిస్క్రిప్షన్​ను సృష్టించారు."

-మాన్​షిండే, రియా తరఫున లాయర్​

కాగా సుశాంత్​ మృతిపై డ్రగ్​ కనెక్షన్​ కోణంలో సాగుతున్న దర్యాప్తులో.. రియా వరుసగా రెండో రోజు ఎన్​సీబీ ముందు హాజరైంది. ఆదివారం మొదటి సారి విచారణ జరగ్గా.. సుమారు ఆరు గంటల పాటు రియాను అధికారులు ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.