భారత్లో తీవ్రమైన కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే ముంబయిలోని బాంద్రాలో సీనియర్ నటి రేఖ నివాస ప్రాంతం 'సీ స్ప్రింగ్స్' ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్గా మారింది. అయితే తన బంగ్లాలోని ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా రావడం వల్ల.. రేఖకు పరీక్షకు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే అందుకు నటి తిరస్కరించినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.
తను ఎవరితోనూ కాంటాక్ట్ అవలేదని, టెస్టు అవసరం లేదని పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తన ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్కు ఆమె అంగీకరించట్లేదని మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
![actress Rekha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rekha_grace_filmfare_glamour__style_awards_2016_22_1507newsroom_1594795558_233.jpg)
ఇప్పటికే రేఖ ఇంటి సమీపంలోనూ చాలా కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. వాటన్నింటినీ అధికారులు శానిటైజ్ చేశారు. అయితే చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె.. టెస్టు చేయించుకుందా? లేదా అనేది తేలలేదు. అయితే ఇప్పటికే రేఖ సమీప బంగ్లాల్లోని నలుగురు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
ఇటీవలే బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా టెస్టులు చేయించుకుంది. అమితాబ్, అభిషేక్.. నానావతి ఆసుపత్రిలో జులై 11 నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మిగిలిన వారంతా హోం క్వారంటైన్లో ఉన్నారు.