చిత్రసీమలో సీనియర్ నటులు భానుచందర్-సుమన్ మంచి మిత్రులు. తాజాగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్నేహం విషయంలో బాపు-రమణల్లాగే తమ బంధం కూడా గట్టిదని అన్నారు భానుచందర్. కాగా, తనకు డబ్బింగ్ చెప్పే విషయంలో సాయికుమార్తో గొడవ జరిగిందని సాగిన ప్రచారంపై స్పందించారు సుమన్. అందులో నిజం లేదని ఆ విషయాన్ని కొట్టిపారేశారు.
'సాయికుమార్ మీకు డబ్బింగ్ చెప్పేవారు. అలాగే రాజశేఖర్కు చెప్పేవారు. అయితే రాజశేఖర్కు చెబితే మీరు తిట్టేవారట. మీకు చెబితే ఆయన తిట్టేవారట. ఇది నిజమేనా' అని ఆలీ అడగిన ప్రశ్నకు సుమన్ సమాధానమిచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'అది నిజం కాదు. రాజశేఖర్ వచ్చే సరికి నేను తెలుగులో ప్రావీణ్యం సంపాదించా. నిజం చెప్పాలంటే నాకు సాయి అవసరం లేదు. కానీ అంత లైఫ్ ఇచ్చిన మనిషిని నేను అలా చేయను. నేనెప్పుడు రాజశేఖర్కు డబ్బింగ్ చెప్పొద్దని అనలేదు. సరదాగా కూడా చెప్పలేదు. అతడిపై నాకు సరదాగా కోపం ఉండేది. స్టార్ నటులకు గాత్రం అందించే స్థాయికి వచ్చాక మళ్లీ కింద స్థాయికి వెళ్లొదని సూచించా. అంతేకానీ ఒకరికి చెప్తే మాట్లాడను అని అనలేదు. ఎవరికి వాయిస్ ఓవర్ చెప్పాలి. ఎవరికి చెప్పకూడదు అనేది సాయి ఇష్టం.'
-సుమన్, సీనియర్ నటుడు.
ప్రస్తుతం సాయికుమార్, సుమన్, భానుచందర్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: విమానంలో సుమ పాట.. కడుపుబ్బా నవ్వాల్సిందే!