ETV Bharat / sitara

ప్రముఖ నటుడు మాధవన్​కు కరోనా - R Madhavan corona positive

అద్భుత పాత్రలతో మెప్పించి, ప్రేక్షకుల్ని అలరించిన ప్రముఖ నటుడు మాధవన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆయన తెలిపారు.

corona
కరోనా
author img

By

Published : Mar 25, 2021, 2:48 PM IST

ప్రముఖ నటుడు మాధవన్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

madhavan
మాధవన్​కు కరోనా

90ల్లో వచ్చిన మణిరత్నం 'అలైపాయతే'(తెలుగులో 'సఖి') సినిమాతో మాధవన్​ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు.

2018లో వచ్చిన 'బ్రీత్' వెబ్ సిరీస్​తో డిజిటల్ తెరంగేట్రం చేశారు. ఇటీవల 'మారా'తో ప్రేక్షకుల్ని పలకరించారు. దుల్కర్​ సల్మాన్​ 'చార్లీ' సినిమాకు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం తొలిసారి దర్శకుడిగా 'రాకెట్రీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

ఇదీ చూడండి: నటుడు మాధవన్​ను వరించిన డాక్టరేట్

ప్రముఖ నటుడు మాధవన్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

madhavan
మాధవన్​కు కరోనా

90ల్లో వచ్చిన మణిరత్నం 'అలైపాయతే'(తెలుగులో 'సఖి') సినిమాతో మాధవన్​ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు.

2018లో వచ్చిన 'బ్రీత్' వెబ్ సిరీస్​తో డిజిటల్ తెరంగేట్రం చేశారు. ఇటీవల 'మారా'తో ప్రేక్షకుల్ని పలకరించారు. దుల్కర్​ సల్మాన్​ 'చార్లీ' సినిమాకు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం తొలిసారి దర్శకుడిగా 'రాకెట్రీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

ఇదీ చూడండి: నటుడు మాధవన్​ను వరించిన డాక్టరేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.