ETV Bharat / sitara

విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె

author img

By

Published : Sep 26, 2020, 5:31 PM IST

Updated : Sep 26, 2020, 6:14 PM IST

స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెను ఐదుగంటల పాటు ఎన్​సీబీ విచారించింది. ప్రస్తుతం శ్రద్ధా, సారా ఆలీఖాన్​లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

NCB
డ్రగ్​ కేసు

సుశాంత్​ సింగ్​ మృతితో సంబంధమున్న డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరోయిన్​ దీపికా పదుకొణెను శనివారం ఐదుగంటలపాటు విచారించింది. ఆమె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను అధికారులు ప్రశ్నించినప్పుడు దీపికనూ ప్రశ్నించినట్లు సమచాారం. 'డీ' అక్షరంతో సాగిన వాట్సాప్ సంభాషణలపై విచారణ సాగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9:50 గంటలకు ఎన్​సీబీ కార్యాలయంలోకి వెళ్లిన దీపిక.. మధ్యాహ్నం 3:50 గంటలకు బయటకు వచ్చింది.

దీపికను విచారించేటప్పుడు తను హాజరుకావచ్చా అని ఆమె భర్త, నటుడు రణ్​వీర్​ సింగ్​ ఎన్​సీబీని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి అభ్యర్థన ఏది తమ వద్దకు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సారా ఆలీఖాన్​, శ్రద్ధా కపూర్​ల విచారణ సాగుతోంది.

సుశాంత్​ సింగ్​ మృతితో సంబంధమున్న డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరోయిన్​ దీపికా పదుకొణెను శనివారం ఐదుగంటలపాటు విచారించింది. ఆమె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను అధికారులు ప్రశ్నించినప్పుడు దీపికనూ ప్రశ్నించినట్లు సమచాారం. 'డీ' అక్షరంతో సాగిన వాట్సాప్ సంభాషణలపై విచారణ సాగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9:50 గంటలకు ఎన్​సీబీ కార్యాలయంలోకి వెళ్లిన దీపిక.. మధ్యాహ్నం 3:50 గంటలకు బయటకు వచ్చింది.

దీపికను విచారించేటప్పుడు తను హాజరుకావచ్చా అని ఆమె భర్త, నటుడు రణ్​వీర్​ సింగ్​ ఎన్​సీబీని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి అభ్యర్థన ఏది తమ వద్దకు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సారా ఆలీఖాన్​, శ్రద్ధా కపూర్​ల విచారణ సాగుతోంది.

Last Updated : Sep 26, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.