ETV Bharat / sitara

కంగన​కు సమన్లు.. త్వరలో ముంబయి వస్తానని నటి ట్వీట్

author img

By

Published : Oct 22, 2020, 5:05 PM IST

Updated : Oct 22, 2020, 5:51 PM IST

ముంబయిలో నమోదైన కేసులో నటి కంగనా రనౌత్​కు సమన్లు జారీ చేశారు. అక్టోబరు 26-27 మధ్య కోర్టు ముందు ఈమె హాజరయ్యే అవకాశముంది.​

summon Kangana Ranaut
నటి కంగనా రనౌత్

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​, ఆమె సోదరి రంగోలీకి ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇదే విషయమై కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. శివసేన తనను చాలా మిస్సవుతుందని, త్వరలోనే ముంబయికి తిరిగొస్తానని అందులో రాసుకొచ్చింది.

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కంగన ట్వీట్స్ చేస్తోందని అందిన ఫిర్యాదు మేరకు, ఆమెపై కేసు పెట్టాలని ముంబయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కంగనకు సమన్లు జారీ చేశారు. అక్టోబరు 26-27 మధ్య ఆమె కోర్టు ముందు హాజరు కానుంది.

జూన్ 14న సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్​ ప్రముఖుల్ని వ్యతిరేకిస్తూ, వారిపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది కంగన. ముంబయిలోని తన భవంతి కూల్చివేత విషయంలోనూ శివసేన ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంది కంగన.

ఇది చదవండి: కంగనా రనౌత్​కు అత్యాచార బెదిరింపులు

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​, ఆమె సోదరి రంగోలీకి ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇదే విషయమై కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. శివసేన తనను చాలా మిస్సవుతుందని, త్వరలోనే ముంబయికి తిరిగొస్తానని అందులో రాసుకొచ్చింది.

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కంగన ట్వీట్స్ చేస్తోందని అందిన ఫిర్యాదు మేరకు, ఆమెపై కేసు పెట్టాలని ముంబయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కంగనకు సమన్లు జారీ చేశారు. అక్టోబరు 26-27 మధ్య ఆమె కోర్టు ముందు హాజరు కానుంది.

జూన్ 14న సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్​ ప్రముఖుల్ని వ్యతిరేకిస్తూ, వారిపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది కంగన. ముంబయిలోని తన భవంతి కూల్చివేత విషయంలోనూ శివసేన ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంది కంగన.

ఇది చదవండి: కంగనా రనౌత్​కు అత్యాచార బెదిరింపులు

Last Updated : Oct 22, 2020, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.