ETV Bharat / sitara

'మరక్కార్' రిలీజ్ డేట్​.. 'సత్యమేవ జయతే 2' వాయిదా

author img

By

Published : Apr 27, 2021, 2:24 PM IST

మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చారిత్రక చిత్రం 'మరక్కార్' 2021, ఆగస్టు 12న రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'సత్యమేవ జయతే 2' విడుదల వాయిదా పడింది.

Mohanlal marakkar
మరక్కార్

ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చారిత్రక చిత్రం 'మరక్కార్' కొత్త విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా 2021, ఆగస్టు 12న రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో అర్జున్‌, కీర్తి సురేష్‌, ప్రణవ్‌ మోహన్‌లాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మంజూ వారియర్‌, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, ముఖేష్, ఫాజిల్, సుహాసిని మణిరత్నంతో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు.

సత్యమేవ జయతే-2 వాయిదా..

జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సత్యమేవ జయతే 2. మిలప్‌ ఝవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సి ఉంది. గతంలో వచ్చిన సత్యమేవ జయతే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.

'ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతను మించింది ఏదీ లేదు. మన సినిమా సత్యమేవ జయతే 2 అనుకున్న రోజున కాకుండా మరో తేదీన వస్తుంది. మాస్క్‌ ధరించండి. మనకు మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జై హింద్‌' అని పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చారిత్రక చిత్రం 'మరక్కార్' కొత్త విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా 2021, ఆగస్టు 12న రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో అర్జున్‌, కీర్తి సురేష్‌, ప్రణవ్‌ మోహన్‌లాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మంజూ వారియర్‌, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, ముఖేష్, ఫాజిల్, సుహాసిని మణిరత్నంతో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు.

సత్యమేవ జయతే-2 వాయిదా..

జాన్‌ అబ్రహాం, దివ్య ఖోస్ల కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సత్యమేవ జయతే 2. మిలప్‌ ఝవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సి ఉంది. గతంలో వచ్చిన సత్యమేవ జయతే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.

'ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతను మించింది ఏదీ లేదు. మన సినిమా సత్యమేవ జయతే 2 అనుకున్న రోజున కాకుండా మరో తేదీన వస్తుంది. మాస్క్‌ ధరించండి. మనకు మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జై హింద్‌' అని పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.