ETV Bharat / sitara

'అందుకే 'మోసగాళ్లు' మార్చి 19న రిలీజ్ చేస్తున్నాం' - మంచు విష్ణు మోసగాళ్లు ప్రచారం

మంచు విష్ణు, కాజల్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది చిత్రబృందం.

Manchu Vishnu about Mosagallu
'అందుకే 'మోసగాళ్లు' మార్చి 19న రిలీజ్ చేస్తున్నాం'
author img

By

Published : Mar 13, 2021, 8:24 AM IST

"ముంబయిలోని మురికివాడల్లో ఉండే అక్కా తమ్ముడు కలిసి అమెరికావాళ్లను ఎలా మోసం చేశారు? రూ.కోట్లు ఎలా గడించారు? అటు అమెరికాకు, ఇటు భారతదేశానికి దొరక్కుండా ఎలా తప్పించుకు తిరిగారు? అనే నేపథ్యంలో తీసిన పాన్‌ఇండియా చిత్రం 'మోసగాళ్లు’' అని మంచు విష్ణు అన్నారు.

Manchu Vishnu about Mosagallu
నవదీప్, విష్ణు

విష్ణు హీరోగా, కాజల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ప్రచారాన్ని శుక్రవారం ఆయన విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. ఇక్కడి మెలోడి థియేటర్లో ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ "మా నాన్న మోహన్‌బాబు పుట్టిన రోజైన మార్చి 19న 'మోసగాళ్లు' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌ వర్క్‌ హైదరాబాద్‌లో మొదలెడదామంటే వద్దనుకొని, ఇక్కడికొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హీరో నవదీప్‌ పాల్గొన్నారు.

"ముంబయిలోని మురికివాడల్లో ఉండే అక్కా తమ్ముడు కలిసి అమెరికావాళ్లను ఎలా మోసం చేశారు? రూ.కోట్లు ఎలా గడించారు? అటు అమెరికాకు, ఇటు భారతదేశానికి దొరక్కుండా ఎలా తప్పించుకు తిరిగారు? అనే నేపథ్యంలో తీసిన పాన్‌ఇండియా చిత్రం 'మోసగాళ్లు’' అని మంచు విష్ణు అన్నారు.

Manchu Vishnu about Mosagallu
నవదీప్, విష్ణు

విష్ణు హీరోగా, కాజల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ప్రచారాన్ని శుక్రవారం ఆయన విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. ఇక్కడి మెలోడి థియేటర్లో ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ "మా నాన్న మోహన్‌బాబు పుట్టిన రోజైన మార్చి 19న 'మోసగాళ్లు' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌ వర్క్‌ హైదరాబాద్‌లో మొదలెడదామంటే వద్దనుకొని, ఇక్కడికొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హీరో నవదీప్‌ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.