ETV Bharat / sitara

25 వేల కుటుంబాలకు అండగా మంచు మనోజ్​

author img

By

Published : May 20, 2021, 10:49 AM IST

Updated : May 20, 2021, 11:26 AM IST

నటుడు మంచు మనోజ్​ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.

manoj
మనోజ్​

నటుడు మంచు మనోజ్​ తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నారు. వారికి నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.

"ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కొవిడ్​ వల్ల ప్రభావితం అయిన వాళ్లందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చెయ్యాలి అనుకుంటున్నా. ముందుగా, మన ప్రాణాల్ని కాపాడడానికి వాళ్ల ప్రాణాలను, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరిని కాపాడుతున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి సమయంలోనే మాస్క్​లు ధరించి, తరచు శానిటైజ్​ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. నా వంతుగా ఈ పుట్టినరోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి కరోనా వల్ల ప్రభావితమైన 25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నా. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం" అన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మనోజ్.

ప్రస్తుతం మంచు మనోజ్ పాన్​ ఇండియా చిత్రంగా రూపొందుతున్న​ 'అహం బ్రహ్మాస్మి'లో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

నటుడు మంచు మనోజ్​ తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నారు. వారికి నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.

"ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కొవిడ్​ వల్ల ప్రభావితం అయిన వాళ్లందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చెయ్యాలి అనుకుంటున్నా. ముందుగా, మన ప్రాణాల్ని కాపాడడానికి వాళ్ల ప్రాణాలను, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరిని కాపాడుతున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి సమయంలోనే మాస్క్​లు ధరించి, తరచు శానిటైజ్​ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. నా వంతుగా ఈ పుట్టినరోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి కరోనా వల్ల ప్రభావితమైన 25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నా. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం" అన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మనోజ్.

ప్రస్తుతం మంచు మనోజ్ పాన్​ ఇండియా చిత్రంగా రూపొందుతున్న​ 'అహం బ్రహ్మాస్మి'లో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

Last Updated : May 20, 2021, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.