బాలీవుడ్ నటుడు రజత్ బేడీ(rajat bedi now) చేసిన యాక్సిడెంట్ వల్ల ఓ వ్యక్తి మరణించారు. తొలుత ఆ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
సోమవారం సాయంత్రం తన పని ముగించుకుని రజత్ బేడీ ఇంటికి వెళ్తున్నారు. అంధేరీలోని ఓ గుడి దగ్గర కార్మికుడు ఒకరు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చారు. దీంతో బ్రేక్లు వేసిన లాభం లేకుండా పోయింది. దీంతో ఆ వ్యక్తిని కారు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతడు.. బుధవారం సాయంత్రం మరణించారు.
యాక్సిడెంట్ చేసినందుకుగానూ రజత్ బేడీపై(Rajat Bedi News) సెక్షన్ 279, 338 కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి మరణంతో 304-ఏ సెక్షన్ కూడా ఎఫ్ఐఆర్లో జోడించినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా రజత్కు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రజత్ బేడీని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.