ETV Bharat / sitara

'చిత్ర పరిశ్రమపై ఓ నటుడు ఆరోపణలు చేయడమా?' - డ్రగ్స్​ రవికిషన్​

చిత్రపరిశ్రమను దిగజార్చేలా భారతీయ జనతా పార్టీ ఎంపీ రవికిషన్​ వ్యాఖ్యలు ఉన్నాయని.. మంగళవారం పార్లమెంటు​లో సమాజ్​వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలోనే ఉంటూ దానిపై తప్పుగా ఆరోపణలు చేయడంపై.. తానూ సిగ్గు పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు.

Jaya Bachchan raises issue of defaming film industry in Rajya Sabha
'చిత్రపరిశ్రమపై ఓ నటుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు'
author img

By

Published : Sep 15, 2020, 1:08 PM IST

Updated : Sep 15, 2020, 1:25 PM IST

సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం గురించి సోమవారం పార్లమెంట్​లో బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ చేసిన ఆరోపణల​పై.. సమాజ్​వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. "చిత్రపరిశ్రమపై మన సభ్యుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను సిగ్గుపడుతున్నాను" అని జయా బచ్చన్​ మంగళవారం రాజ్యసభ శూన్యగంటలో ప్రస్తావించారు.

"చిత్రపరిశ్రమకు ఉన్న ప్రతిష్టను కేవలం కొంతమంది ఏ మాత్రం దిగజార్చలేరు. నిన్న మన పార్లమెంట్​ సభ్యుల్లో ఒకరు సినీఇండస్ట్రీకి సంబంధించిన వారు అయినా చిత్రపరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది. ఇది సిగ్గుచేటు."

- జయా బచ్చన్​, సమాజ్​వాద్​ పార్టీ రాజ్యసభ సభ్యురాలు

వినోద పరిశ్రమను కించపరిచే విధంగా కుట్రపన్నారనే ఆరోపణలతో.. సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఎగువసభ శూన్యగంటలో నోటీసు ఇచ్చారు జయ. అయితే చిత్రపరిశ్రమలో పనిచేసే వ్యక్తులే సోషల్​మీడియాలో దాని విలువ దిగజారుస్తున్నారని ఆమె తెలిపారు. అయితే పార్లమెంటులో సోమవారం ఓ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదని.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం నిలువరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జయా బచ్చన్​.

నాకు మద్దతు ఇస్తారని భావించా..

జయా బచ్చన్​ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా ఎంపీ రవికిషన్​.."నా వ్యాఖ్యలకు జయా బచ్చన్​ మద్దతు ఇస్తారని భావించా. ఎందుకంటే చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్​ తీసుకుంటున్నారని నేను చెప్పలేదు. కేవలం కొంతమంది మాత్రమే వారి చేష్టలతో ప్రపంచంలోని అతిపెద్ద చిత్రపరిశ్రమను అంతం చేయాలని అనుకుంటున్నారు. జయా బచ్చన్​, నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిస్థితి ఇలా లేదు. కానీ, ఇప్పుడు మన చిత్రపరిశ్రమను రక్షించుకోవాలి" అని అన్నారు.

పార్లమెంటు వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన నియంత్రణ చర్యలతో ప్రారంభించిన ఈ సెషన్​ అక్టోబరు 1న ముగుస్తుంది.

సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం గురించి సోమవారం పార్లమెంట్​లో బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ చేసిన ఆరోపణల​పై.. సమాజ్​వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. "చిత్రపరిశ్రమపై మన సభ్యుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను సిగ్గుపడుతున్నాను" అని జయా బచ్చన్​ మంగళవారం రాజ్యసభ శూన్యగంటలో ప్రస్తావించారు.

"చిత్రపరిశ్రమకు ఉన్న ప్రతిష్టను కేవలం కొంతమంది ఏ మాత్రం దిగజార్చలేరు. నిన్న మన పార్లమెంట్​ సభ్యుల్లో ఒకరు సినీఇండస్ట్రీకి సంబంధించిన వారు అయినా చిత్రపరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది. ఇది సిగ్గుచేటు."

- జయా బచ్చన్​, సమాజ్​వాద్​ పార్టీ రాజ్యసభ సభ్యురాలు

వినోద పరిశ్రమను కించపరిచే విధంగా కుట్రపన్నారనే ఆరోపణలతో.. సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఎగువసభ శూన్యగంటలో నోటీసు ఇచ్చారు జయ. అయితే చిత్రపరిశ్రమలో పనిచేసే వ్యక్తులే సోషల్​మీడియాలో దాని విలువ దిగజారుస్తున్నారని ఆమె తెలిపారు. అయితే పార్లమెంటులో సోమవారం ఓ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదని.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం నిలువరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జయా బచ్చన్​.

నాకు మద్దతు ఇస్తారని భావించా..

జయా బచ్చన్​ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా ఎంపీ రవికిషన్​.."నా వ్యాఖ్యలకు జయా బచ్చన్​ మద్దతు ఇస్తారని భావించా. ఎందుకంటే చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్​ తీసుకుంటున్నారని నేను చెప్పలేదు. కేవలం కొంతమంది మాత్రమే వారి చేష్టలతో ప్రపంచంలోని అతిపెద్ద చిత్రపరిశ్రమను అంతం చేయాలని అనుకుంటున్నారు. జయా బచ్చన్​, నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిస్థితి ఇలా లేదు. కానీ, ఇప్పుడు మన చిత్రపరిశ్రమను రక్షించుకోవాలి" అని అన్నారు.

పార్లమెంటు వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన నియంత్రణ చర్యలతో ప్రారంభించిన ఈ సెషన్​ అక్టోబరు 1న ముగుస్తుంది.

Last Updated : Sep 15, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.