ETV Bharat / sitara

ఓటీటీల బాటలో భారతీయ సినీ ప్రేక్షకులు

author img

By

Published : Jul 12, 2020, 4:52 PM IST

భారతదేశంలో లాక్​డౌన్​ కారణంగా ప్రేక్షకులంతా ఓటీటీల బాట పట్టారని ఓ ప్రముఖ యాప్​ డిస్ట్రిబ్యూషన్​ సంస్థ పేర్కొంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఆన్​లైన్ ​వేదికలను ఎంపిక చేసుకుంటున్నారని సర్వేలో తేలింది.

Indians prefer to watch movies on OTT platforms during the social distancing times, a survey by MoMagic
'లాక్​డౌన్​లో భారతీయులపై ఓటీటీల ప్రభావం'

లాక్​డౌన్​ కారణంగా భారతీయులపై ఓటీటీల ప్రభావం ఎక్కువగా పడిందని ఓ సర్వే తెలిపింది. కరోనా విరామ సమయంలో ఎలాంటి సినిమా షూటింగ్​లు జరగకపోవడం వల్ల సినీ అభిమానులంతా ఆన్​లైన్​ వేదికల బాట పట్టారని పేర్కొంది. యాప్​ డిస్ట్రిబ్యూషన్​ ప్లాట్​​ఫామ్​ మోమ్యాజిక్​ చేపట్టిన సర్వేలో భారతీయులు అధికంగా ఓటీటీలకు ఆకర్షితులయ్యారని వెల్లడైంది.

Indians prefer to watch movies on OTT platforms during the social distancing times, a survey by MoMagic
మోమాజిక్​ సర్వే ప్రకారం ప్రేక్షకుల అభిప్రాయం

"71 శాతం మంది ప్రేక్షకులు థియేటర్​లోని టిక్కెట్​ ధర కారణంగా ఓటీటీల బాట పట్టారు. మిగిలిన 27 శాతం మందికి ధరతో పెద్దగా పట్టింపు లేదు" అని తెలిపారు మోమ్యాజిక్​ టెక్నాలజీస్​ సీఈఓ, వ్యవస్థాపకుడు అరుణ్​ గుప్తా.

థియేటర్​ కంటే అదే బెటర్​

ఇందులో 72 శాతం మంది సినిమా హాళ్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే పెద్ద తెర కలిగిన టెలివిజన్​ను కొని దానికి హోమ్​ థియేటర్​ను అమర్చుకోవాలని భావిస్తున్నారట. అందువల్ల తమకు ఇష్టమైన సినిమాలు కుటుంబంతో సహా కలిసి చూడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక తెలిపింది.

లాక్​డౌన్​ కారణంగా భారతీయులపై ఓటీటీల ప్రభావం ఎక్కువగా పడిందని ఓ సర్వే తెలిపింది. కరోనా విరామ సమయంలో ఎలాంటి సినిమా షూటింగ్​లు జరగకపోవడం వల్ల సినీ అభిమానులంతా ఆన్​లైన్​ వేదికల బాట పట్టారని పేర్కొంది. యాప్​ డిస్ట్రిబ్యూషన్​ ప్లాట్​​ఫామ్​ మోమ్యాజిక్​ చేపట్టిన సర్వేలో భారతీయులు అధికంగా ఓటీటీలకు ఆకర్షితులయ్యారని వెల్లడైంది.

Indians prefer to watch movies on OTT platforms during the social distancing times, a survey by MoMagic
మోమాజిక్​ సర్వే ప్రకారం ప్రేక్షకుల అభిప్రాయం

"71 శాతం మంది ప్రేక్షకులు థియేటర్​లోని టిక్కెట్​ ధర కారణంగా ఓటీటీల బాట పట్టారు. మిగిలిన 27 శాతం మందికి ధరతో పెద్దగా పట్టింపు లేదు" అని తెలిపారు మోమ్యాజిక్​ టెక్నాలజీస్​ సీఈఓ, వ్యవస్థాపకుడు అరుణ్​ గుప్తా.

థియేటర్​ కంటే అదే బెటర్​

ఇందులో 72 శాతం మంది సినిమా హాళ్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే పెద్ద తెర కలిగిన టెలివిజన్​ను కొని దానికి హోమ్​ థియేటర్​ను అమర్చుకోవాలని భావిస్తున్నారట. అందువల్ల తమకు ఇష్టమైన సినిమాలు కుటుంబంతో సహా కలిసి చూడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.