ETV Bharat / sitara

ఐటీ దాడుల విషయంపై స్పందించిన హీరోయిన్ రష్మిక

author img

By

Published : Feb 19, 2020, 6:07 PM IST

Updated : Mar 1, 2020, 8:58 PM IST

తన ఇంటిపై ఇటీవలే జరిగిన ఆదాయ పన్నుశాఖ దాడుల గురించి మాట్లాడింది హీరోయిన్ రష్మిక. ఆ సమయంలో ఆందోళనకు గురయ్యానని చెప్పింది.

ఐటీ దాడుల విషయంపై స్పందించిన రష్మిక
హీరోయిన్ రష్మిక

కెరీర్​ ఎదుగుతున్న క్రమంలో తన నివాసంపై ఐటీ దాడులు జరగడం, ఆందోళనకు గురి చేసిందని చెప్పింది హీరోయిన్ రష్మిక. తక్షణమే షూటింగ్​ ఆపేసి ఇంటికి వెళ్లినట్లు వివరించింది. ఈ విషయాన్ని 'భీష్మ' ప్రచారంలో భాగంగా వెల్లడించింది.

తన ఇంటిపై జరిగిన ఐటీ దాడుల గురించి చెబుతున్న హీరోయిన్ రష్మిక

తన ఇంటిపై సోదాలు జరుగుతున్న సమయంలోనే 'భీష్మ' సినిమాలోని ఓ పాటలో ఈ పరిస్థితికి సంబంధించిన లిరిక్స్​కు వచ్చాయని, అప్పుడు తను షాకయ్యానని రష్మిక చెప్పింది.

ఏమీ లేనప్పుడు ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని రష్మికకు భరోసా ఇచ్చాడు హీరో నితిన్. ఐటీ దాడుల సమయంలో రష్మిక ఎలాంటి ఆందోళనకు గురైందో దర్శకుడు వెంకీ కుడుముల వివరించాడు.

ఈనెల 21న రానుందీ 'భీష్మ'. మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

కెరీర్​ ఎదుగుతున్న క్రమంలో తన నివాసంపై ఐటీ దాడులు జరగడం, ఆందోళనకు గురి చేసిందని చెప్పింది హీరోయిన్ రష్మిక. తక్షణమే షూటింగ్​ ఆపేసి ఇంటికి వెళ్లినట్లు వివరించింది. ఈ విషయాన్ని 'భీష్మ' ప్రచారంలో భాగంగా వెల్లడించింది.

తన ఇంటిపై జరిగిన ఐటీ దాడుల గురించి చెబుతున్న హీరోయిన్ రష్మిక

తన ఇంటిపై సోదాలు జరుగుతున్న సమయంలోనే 'భీష్మ' సినిమాలోని ఓ పాటలో ఈ పరిస్థితికి సంబంధించిన లిరిక్స్​కు వచ్చాయని, అప్పుడు తను షాకయ్యానని రష్మిక చెప్పింది.

ఏమీ లేనప్పుడు ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని రష్మికకు భరోసా ఇచ్చాడు హీరో నితిన్. ఐటీ దాడుల సమయంలో రష్మిక ఎలాంటి ఆందోళనకు గురైందో దర్శకుడు వెంకీ కుడుముల వివరించాడు.

ఈనెల 21న రానుందీ 'భీష్మ'. మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

Last Updated : Mar 1, 2020, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.