ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 'మామీ' (ముంబయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసింది. వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్ల తాను వేరే బాధ్యతలపై దృష్టి సారించడానికి సమయం సరిపోవడం లేదని ఆమె తెలిపింది. ఈ మేరకు తాజాగా ఇన్స్టా స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది.
"మామీ' బోర్డులో సభ్యురాలిగా ఉన్నందుకు, చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నా. ఒక నటిగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టాలెంట్ని గుర్తించి ముంబయికి తీసుకురావడం ఆనందాన్ని ఇచ్చింది. అయితే, ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నేను బిజీగా ఉన్నాను. దానివల్ల 'మామీ'కి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నా. దాంతో నేను పదవీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నా. 'మామీ'తో నాకున్న అనుబంధం విడదీయరానిది."
-దీపికా పదుకొణె, బాలీవుడ్ నటి
ఆమిర్ఖాన్ సతీమణి కిరణ్రావు పదవీ కాలం పూర్తైన తర్వాత 2019లో దీపిక 'మామీ' చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుతం ఆమె షారుఖ్ నటిస్తున్న 'పఠాన్' చిత్ర షూట్లో బిజీగా ఉంది. అలాగే హృతిక్ కథానాయకుడిగా రానున్న 'ఫైటర్'తోపాటు నాగ్అశ్విన్-ప్రభాస్ ప్రాజెక్ట్లోనూ దీపిక హీరోయిన్గా చేస్తోంది.