ETV Bharat / sitara

కరోనాపై బాలీవుడ్​ ఫైట్​- అభిమానులకు జాగ్రత్తలు - కరోనాపై జాగ్రత్త వహించండి

బాలీవుడ్​ దర్శక నిర్మాతలు, తారలు... కరోనా వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు వహిస్తున్నారు. మాస్క్​లు, శానిటైజర్స్​ను వినియోగిస్తున్నారు. తమ అభిమానులకు, ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్త వహించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా సూచనలు ఇస్తున్నారు.

Coronavirus:
కరోనాపై జాగ్రత్త వహించండి
author img

By

Published : Mar 5, 2020, 7:02 AM IST

కరోనా ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. పలు దేశాల్లో ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. భారత్​లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు జాగ్రత్తలు వహిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్​ దర్శకనిర్మాతలు, నటులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైతే తమ కార్యకలాపాలను వాయిదా వేసుకుంటున్నారు.

ప్రజలకు సూచనలు

పలువురు బాలీవుడ్​ నటులు తమ అభిమానులకు, ప్రజలకు కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తాము మాస్క్​లు ధరించిన ఫోటోలను పోస్ట్​ చేస్తూ సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్​ కథానాయికలు సన్నిలియోని, పరినితి చోప్రా, సోహా అలీ ఖాన్​తో పాటు​ పలువురు ఈ జాబితాలో ఉన్నారు.

బాలీవుడ్​ కథానాయిక సన్నీలియోని తన భర్తతో కలిసి ఓ విమానాశ్రయంలో మాస్కులు ధరించి ఫోటో దిగింది. దానికి క్యాప్షన్​ జోడించి ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది.

"కరోనా పట్ల జాగ్రత్త వహించండి. అస్సలు విస్మరించవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి."

-సన్ని లియోని, కథానాయిక.

"విచారంగా ఉంది. కానీ ముందే ఊహించాను ఈ పరిస్థితి వస్తుందని. జాగ్రత్త వహించండి."

-పరిణితి చోప్రా, కథానాయిక.

"పెరిగిపోతున్న కరోనా, వాయు కాలుష్యంలో మాస్క్​లను తప్పక ధరించండి."

-​ సోహా అలీ ఖాన్​, కథానాయిక.

అవుట్​డోర్​ షూటింగ్స్​

దర్శకనిర్మాతలు తమ అవుట్​డోర్​ షూటింగ్ లొకేషన్స్​​ ఎంచుకునేటప్పుడు... ఆ ప్రాంతం కరోనా ప్రభావిత ప్రాంతమా? కాదా? అని పలుమార్లు తనిఖీ చేసుకుంటున్నారు. ఈ షూటింగ్​లకు వెళ్లినప్పుడు ముందస్తు జాగ్రత్తగా మాస్క్​, శానిటైజర్స్​ను వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి : ఆ దర్శకుడితో అనుష్క డేటింగ్​.. నిజమేనా!

కరోనా ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. పలు దేశాల్లో ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. భారత్​లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు జాగ్రత్తలు వహిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్​ దర్శకనిర్మాతలు, నటులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైతే తమ కార్యకలాపాలను వాయిదా వేసుకుంటున్నారు.

ప్రజలకు సూచనలు

పలువురు బాలీవుడ్​ నటులు తమ అభిమానులకు, ప్రజలకు కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తాము మాస్క్​లు ధరించిన ఫోటోలను పోస్ట్​ చేస్తూ సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్​ కథానాయికలు సన్నిలియోని, పరినితి చోప్రా, సోహా అలీ ఖాన్​తో పాటు​ పలువురు ఈ జాబితాలో ఉన్నారు.

బాలీవుడ్​ కథానాయిక సన్నీలియోని తన భర్తతో కలిసి ఓ విమానాశ్రయంలో మాస్కులు ధరించి ఫోటో దిగింది. దానికి క్యాప్షన్​ జోడించి ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది.

"కరోనా పట్ల జాగ్రత్త వహించండి. అస్సలు విస్మరించవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి."

-సన్ని లియోని, కథానాయిక.

"విచారంగా ఉంది. కానీ ముందే ఊహించాను ఈ పరిస్థితి వస్తుందని. జాగ్రత్త వహించండి."

-పరిణితి చోప్రా, కథానాయిక.

"పెరిగిపోతున్న కరోనా, వాయు కాలుష్యంలో మాస్క్​లను తప్పక ధరించండి."

-​ సోహా అలీ ఖాన్​, కథానాయిక.

అవుట్​డోర్​ షూటింగ్స్​

దర్శకనిర్మాతలు తమ అవుట్​డోర్​ షూటింగ్ లొకేషన్స్​​ ఎంచుకునేటప్పుడు... ఆ ప్రాంతం కరోనా ప్రభావిత ప్రాంతమా? కాదా? అని పలుమార్లు తనిఖీ చేసుకుంటున్నారు. ఈ షూటింగ్​లకు వెళ్లినప్పుడు ముందస్తు జాగ్రత్తగా మాస్క్​, శానిటైజర్స్​ను వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి : ఆ దర్శకుడితో అనుష్క డేటింగ్​.. నిజమేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.