Mahesh Manjrekar case: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్పై కేసు నమోదైంది. ఆయన తెరకెక్కించిన ఓ సినిమాలో పిల్లలపై అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణం.
ఇటీవల మహేశ్ మంజ్రేకర్ 'నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా' అనే ఓ మరాఠి సినిమా తీశారు. ఈ మూవీలోని సన్నివేశాలను ఎక్కువగా పిల్లలపైనే చిత్రీకరించారు. వారిపై జరిగే అకృత్యాలు, వాళ్లను బానిసలుగా చూపే అంశాలపైనే ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
అయితే ఈ సినిమాలో సీన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ్ దేశ్ పాండే.. మహేశ్పై కేసు పెట్టారు. చిత్రంలో నటించిన పిల్లలంతా మైనర్లు అని, వారిపై అలాంటి దృశ్యాలు చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చుక్కెదురు
అయితే దీనిపై ముంబయి హైకోర్టును ఆశ్రయించారు మహేశ్. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా విచారించిన కోర్టు.. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: బాక్సాఫీస్పై 'భీమ్లానాయక్' దండయాత్ర.. నైజాంలో ఆల్టైం రికార్డ్!