హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ పోరీలుగా పేరు తెచ్చుకున్నారు.ఆ చిత్రంలో వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో సందడి చేయబోతున్నారని టాక్. ఓ మెగాహీరో పక్కన అలరించనున్నారట.
కథానాయకుడు వరుణ్తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్ కథతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కియారాను తొలుత హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. ఆమె డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టును వదులుకుంది. ఇప్పుడామె స్థానంలో నిధి అగర్వాల్ ఎంపికైందని సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రకు నభా నటేశ్ పేరును చిత్రబృందం పరిశీలిస్తోంది. ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది చదవండి: బాక్సర్గా వరుణ్తేజ్.. మరో ప్రయోగానికి సిద్ధం