ETV Bharat / sitara

కరోనాపై పోరుకు అక్షయ్​ రూ.25 కోట్ల విరాళం

author img

By

Published : Mar 28, 2020, 7:38 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా సినీపరిశ్రమ తన వంతు సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇందులో భాగం అవ్వగా.. తాజాగా బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ ఆ జాబితాలో చేరాడు. కరోనాపై పోరాటానికి రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు.

Bollywood star Akshay Kumar donates Rs 25 crore to Prime Minister's Aid
కరోనాపై పోరాటంలో అక్షయ్​ రూ.25 కోట్ల విరాళం

మహమ్మారి కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలువురు సినీప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఇప్పుడా జాబితాలో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ చేరాడు. కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం తన వంతు సాయంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించి తనకున్న పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు అతడు ప్రకటించాడు.

అక్షయ్​ ప్రస్తుతం నటిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రీకరణ దశలో ఉంది. మార్చి 28న విడుదల కావాల్సిన 'సూర్యవంశీ' చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో.

మహమ్మారి కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలువురు సినీప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఇప్పుడా జాబితాలో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ చేరాడు. కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం తన వంతు సాయంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించి తనకున్న పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు అతడు ప్రకటించాడు.

అక్షయ్​ ప్రస్తుతం నటిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రీకరణ దశలో ఉంది. మార్చి 28న విడుదల కావాల్సిన 'సూర్యవంశీ' చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో.

ఇదీ చూడండి.. అక్షయ్​కు డైలాగ్​ డెలివరీలో ప్రత్యేక శిక్షణ! ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.