ETV Bharat / sitara

నకిలీ ఫాలోవర్స్​ స్కామ్​లో ఆ సెలబ్రిటీలే అధికం - బాధ్,ా

నకిలీ ఫాలోవర్స్​ స్కామ్​ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సంగీత కళాకారులు​, ర్యాపర్​లు ఇందులో అధిక సంఖ్యలో భాగస్వాములవుతున్నారని తెలుస్తోంది. యూట్యూబ్​లో వీక్షణలు కోసం కొన్ని సంస్థలకు వీరు పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తున్నారని సమాచారం.

badshah
బాద్షా
author img

By

Published : Aug 12, 2020, 8:28 PM IST

సోషల్​మీడియాలో నకిలీ ఫాలోవర్స్​ స్కామ్​ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముంబయి పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ ర్యాపర్​ బాద్​షాను ముంబయి పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

తన ఆల్బమ్ సాంగ్ 'పాగల్' వ్యూస్​ పెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు.. బాద్​షా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 7.2 కోట్ల వీక్షణల కోసం ఈ మ్యూజిక్​ డైరెక్టర్​ ఏకంగా రూ.72 లక్షలు చెల్లించాడని స్పష్టం చేశారు.

అయితే తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఇతడితో పాటు బాలీవుడ్​ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా అనేకమంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వాములయ్యారని దర్యాప్తులో తేలింది. అయితే వీరిలో ఎక్కువ మంది సంగీత కళాకారులే ఉన్నట్లు తెలిసింది. కానీ వారి వివరాలు తెలియలేదు.

ఈ రాకెట్​లో బాలీవుడ్​ ప్రముఖులు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాకెట్​ నడుస్తోందని పోలీసులు అంటున్నారు.

badshah
బాద్షా

సాఫ్ట్​వేర్​ ద్వారా

నకిలీ వీక్షణల కోసం బాట్స్​, సర్వర్​ ఫార్మ్స్​ అనే సాఫ్ట్​వేర్​ ప్రోగ్రామ్స్​ వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు పోలీసులు. బాద్​షా కూడా ఇదే చేశాడని అన్నారు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టతనిస్తామని తెలిపారు. కానీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు బాద్​షా. తాను ఎలాంటి సాఫ్ట్​వేర్లను వినియోగించలేదని.. కేవలం డబ్బులు మాత్రమే చెల్లించినట్లు స్పష్టం చేశాడు.

యూట్యూబ్​లోనే బడా దందా

ఈ స్కామ్​ అధికంగా యూట్యూబ్​లోనే జరుగుతోందని తెలిసింది. ఈ సామాజిక మాధ్యమంలో పాపులారిటీ కోసం సంగీత దర్శకులు అడ్డదారులు తొక్కుతున్నారు. దాదాపు 40 నుంచి 360 మిలియన్ల రూపాయలు వరకు సగటున బదిలీలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగింది?

బాద్​షా రూపొందించిన ఆల్బమ్ గీతం 'పాగల్'.. విడుదలైన 24 గంటల్లో 75 మిలియన్ల వ్యూస్​ సాధించింది. ఈ క్రమంలోనే టేలర్ స్విఫ్ట్, కొరియన్ బ్యాండ్ బీటీఎస్ రికార్డులను అధిగమించింది. అయితే గూగుల్ ఈ వాదనను తిరస్కరించింది. దీంతో నకిలీ ఫాలోవర్ల అంశం తెరపైకి వచ్చింది.

ఈ స్కామ్​తో సంబంధముందనే అనుమానంతో పోలీసులు బాద్​షాను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 20 మంది సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్​తో సంబంధమున్న​ 54 సంస్థలను గుర్తించామని జాయింట్​ కమిషనర్​ వినయ్​ కుమార్​ చౌబే వెల్లడించారు.

సోషల్​మీడియాలో నకిలీ ఫాలోవర్స్​ స్కామ్​ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముంబయి పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ ర్యాపర్​ బాద్​షాను ముంబయి పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

తన ఆల్బమ్ సాంగ్ 'పాగల్' వ్యూస్​ పెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు.. బాద్​షా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 7.2 కోట్ల వీక్షణల కోసం ఈ మ్యూజిక్​ డైరెక్టర్​ ఏకంగా రూ.72 లక్షలు చెల్లించాడని స్పష్టం చేశారు.

అయితే తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఇతడితో పాటు బాలీవుడ్​ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా అనేకమంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వాములయ్యారని దర్యాప్తులో తేలింది. అయితే వీరిలో ఎక్కువ మంది సంగీత కళాకారులే ఉన్నట్లు తెలిసింది. కానీ వారి వివరాలు తెలియలేదు.

ఈ రాకెట్​లో బాలీవుడ్​ ప్రముఖులు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాకెట్​ నడుస్తోందని పోలీసులు అంటున్నారు.

badshah
బాద్షా

సాఫ్ట్​వేర్​ ద్వారా

నకిలీ వీక్షణల కోసం బాట్స్​, సర్వర్​ ఫార్మ్స్​ అనే సాఫ్ట్​వేర్​ ప్రోగ్రామ్స్​ వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు పోలీసులు. బాద్​షా కూడా ఇదే చేశాడని అన్నారు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టతనిస్తామని తెలిపారు. కానీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు బాద్​షా. తాను ఎలాంటి సాఫ్ట్​వేర్లను వినియోగించలేదని.. కేవలం డబ్బులు మాత్రమే చెల్లించినట్లు స్పష్టం చేశాడు.

యూట్యూబ్​లోనే బడా దందా

ఈ స్కామ్​ అధికంగా యూట్యూబ్​లోనే జరుగుతోందని తెలిసింది. ఈ సామాజిక మాధ్యమంలో పాపులారిటీ కోసం సంగీత దర్శకులు అడ్డదారులు తొక్కుతున్నారు. దాదాపు 40 నుంచి 360 మిలియన్ల రూపాయలు వరకు సగటున బదిలీలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగింది?

బాద్​షా రూపొందించిన ఆల్బమ్ గీతం 'పాగల్'.. విడుదలైన 24 గంటల్లో 75 మిలియన్ల వ్యూస్​ సాధించింది. ఈ క్రమంలోనే టేలర్ స్విఫ్ట్, కొరియన్ బ్యాండ్ బీటీఎస్ రికార్డులను అధిగమించింది. అయితే గూగుల్ ఈ వాదనను తిరస్కరించింది. దీంతో నకిలీ ఫాలోవర్ల అంశం తెరపైకి వచ్చింది.

ఈ స్కామ్​తో సంబంధముందనే అనుమానంతో పోలీసులు బాద్​షాను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 20 మంది సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్​తో సంబంధమున్న​ 54 సంస్థలను గుర్తించామని జాయింట్​ కమిషనర్​ వినయ్​ కుమార్​ చౌబే వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.