ETV Bharat / sitara

అల్లు అర్జున్ 'పుష్ప'.. రెండు భాగాలుగా!

author img

By

Published : May 6, 2021, 2:45 PM IST

బన్నీ- సుకుమార్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. కొన్నిరోజుల క్రితం విడుదలైన పుష్పరాజ్​ గ్లింప్స్​ అలరిస్తుండగా, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

Allu Arjun's Pushpa movie to release in Two Parts
రెండు భాగాలుగా తెరకెక్కనున్న 'పుష్ప'!

'తగ్గేదే లే' అంటూ మాస్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట.

ఈ నేపథ్యంలో 'పుష్ప' రిలీజ్‌ గురించి ఇప్పుడు అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనేది చాలా పెద్ద అంశం కావడం వల్ల ఈ కథను మొదట సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు అందించాలని సుకుమార్‌ భావించారట. అదే విషయాన్ని బన్నీతో చెప్పగా ఆయన కూడా సరే అన్నారట. దీంతో దేశంలో పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాదిలో 'పుష్ప' మొదటి భాగాన్ని, వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు చూసిన నెటిజన్లు.. 'ఇదేంటబ్బా కొత్తగా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్‌-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: బార్బీ బొమ్మకి చెల్లెలివా.. బాబోయ్​ ప్రపంచ సుందరివా?

'తగ్గేదే లే' అంటూ మాస్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట.

ఈ నేపథ్యంలో 'పుష్ప' రిలీజ్‌ గురించి ఇప్పుడు అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనేది చాలా పెద్ద అంశం కావడం వల్ల ఈ కథను మొదట సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు అందించాలని సుకుమార్‌ భావించారట. అదే విషయాన్ని బన్నీతో చెప్పగా ఆయన కూడా సరే అన్నారట. దీంతో దేశంలో పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాదిలో 'పుష్ప' మొదటి భాగాన్ని, వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు చూసిన నెటిజన్లు.. 'ఇదేంటబ్బా కొత్తగా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్‌-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: బార్బీ బొమ్మకి చెల్లెలివా.. బాబోయ్​ ప్రపంచ సుందరివా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.