ETV Bharat / sitara

ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందు 'లక్ష్మీబాంబ్'!

author img

By

Published : May 8, 2020, 4:11 PM IST

హీరో అక్షయ్ కుమార్ 'లక్ష్మీబాంబ్'ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

Akshay Kumar Fans Want to See Laxmmi Bomb in Theatres
అక్షయ్​కుమార్​

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కన్పించట్లేదు. ఈ క్రమంలోనే నిర్మాతలు ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు. తమ చిత్రాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న 'లక్ష్మీబాంబ్‌'ను, హాట్‌స్టార్​‌లో వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ విషయమై నిర్మాతలు అక్షయ్‌ కుమార్, విజయ్‌ సింగ్, తుషార్‌ కపూర్‌ల మధ్య వీడియో కాల్స్‌ ద్వారా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం ఈనెల 22 థియేటర్లలో విడుదల కావాల్సి ఉందీ చిత్రం. దక్షిణాది హిట్ 'కాంచన' రీమేక్​గా దీనిని తీస్తున్నారు. రాఘవ లారెన్స్‌ దర్శకుడు. కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది.

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కన్పించట్లేదు. ఈ క్రమంలోనే నిర్మాతలు ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు. తమ చిత్రాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న 'లక్ష్మీబాంబ్‌'ను, హాట్‌స్టార్​‌లో వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ విషయమై నిర్మాతలు అక్షయ్‌ కుమార్, విజయ్‌ సింగ్, తుషార్‌ కపూర్‌ల మధ్య వీడియో కాల్స్‌ ద్వారా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం ఈనెల 22 థియేటర్లలో విడుదల కావాల్సి ఉందీ చిత్రం. దక్షిణాది హిట్ 'కాంచన' రీమేక్​గా దీనిని తీస్తున్నారు. రాఘవ లారెన్స్‌ దర్శకుడు. కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి : సల్మాన్ ఫామ్​హౌస్​లోని జాక్వెలిన్ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.