మహా శివరాత్రి పురస్కరించుకొని మార్చి 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది 'గాలి సంపత్' సినిమా. అయితే రిలీజైన వారానికే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. 'ఆహాలో మార్చి 19 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో పాటు అదే రోజు 'క్షణక్షణం' కూడా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఉదయ్ శంకర్, జియా శర్మ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.
![aha alert: gaali sampath zombie reddy release dates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11058277_2.jpg)
జాంబీలను తెలుగుతెరకు పరిచయం చేసిన చిత్రం 'జాంబీరెడ్డి'. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు 'ఆహా'లో మార్చి 26 నుంచి చిన్నతెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా, ప్రశాంత్వర్మ దర్శకుడు.
![aha alert: gaali sampath zombie reddy release dates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11058277_1.jpg)
![aha alert: gaali sampath zombie reddy release dates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11058277_3.jpg)