నటి నివేదా థామస్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ప్రస్తుతం తాను వైద్య పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే 'వకీల్సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. ఇటీవల కాలంలో ఈ చిత్ర ప్రచారంలో పాల్గొన్నారు.
2002లో మలయాళ చిత్రం 'ఉత్తర'తో బాలనటిగా నివేదా థామస్ తెరంగ్రేటం చేశారు. అలా పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ.. 2016లో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయ్యారు. 2016లో నాని కథానాయకుడుగా విడుదలైన 'జెంటిల్మెన్' చిత్రంతో టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఆ తర్వాత మళ్లీ నానితో 'నిన్నుకోరి' వంటి ప్రేమకథతో మెప్పించారు. ఆ తర్వాత 'జై లవకుశ', 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్', '118', 'బ్రోచేవారెవరురా' 'వి' సినిమాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'జెంటిల్మన్'తో వచ్చి 'నిన్ను కోరే'లా చేశావ్!