కొవిడ్ పోరులో భాగంగా హీరో అజిత్, మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్కు ఇప్పుడు రూ.10 లక్షలు విరాళమందించారు. ఈ విషయాన్ని ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి వెల్లడించారు.
సినీ కార్మికుల కోసం హీరో అజిత్ విరాళం
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ కార్మికులు, పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికోసం రూ.10 లక్షల విరాళమిచ్చారు తమిళ కథానాయకుడు అజిత్.
![సినీ కార్మికుల కోసం హీరో అజిత్ విరాళం Actor Ajith donates 10 lakhs rupees to FEFSI Union](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11769338-45-11769338-1621074109819.jpg?imwidth=3840)
ప్రస్తుతం 'వాలిమై' చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఇందులో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో 'వాలిమై', థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: కరోనా బాధితుల కోసం హీరో అజిత్ భారీ సాయం
కొవిడ్ పోరులో భాగంగా హీరో అజిత్, మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్కు ఇప్పుడు రూ.10 లక్షలు విరాళమందించారు. ఈ విషయాన్ని ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి వెల్లడించారు.
ప్రస్తుతం 'వాలిమై' చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఇందులో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో 'వాలిమై', థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: కరోనా బాధితుల కోసం హీరో అజిత్ భారీ సాయం