ETV Bharat / sitara

ఆమిర్ తనయుడి వెండితెర అరంగేట్రం.. సోదరి పోస్ట్

author img

By

Published : Feb 15, 2021, 3:30 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ అతడి సోదరి ఇరా ఖాన్ ఇన్​స్టా పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Aamir Khan's son Junaid's debut Maharaja goes on floor, sis Ira Khan confirms
ఆమిర్ తనయుడి వెండితెర అరంగేట్రం!

బాలీవుడ్ మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. జునైద్ సోదరి ఇరా ఖాన్​ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

జునైద్​కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న ఓ ఫొటోను షేర్ చేసిన ఇరా ఖాన్.. 'ఇదే నీకు షూటింగ్​లో మొదటి రోజు' అంటూ రాసుకొచ్చింది. "జున్నూ ఇది నీకు మొదటి నాటకం, మొదటి షో, లేదా మనిద్దరం కలిసి చేసిన మొదటి నాటకం కాదు. కానీ షూటింగ్​లో ఇది నీకు మొదటి రోజు. ఈ ఫొటో నాకు చాలా ఇష్టం. చాలా ఏళ్లుగా నువ్వు నటిస్తున్నా.. ఇది నాకు కొత్తగానే ఉంది. నీ నటన పట్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. సినిమా గురించి ఏ విషయం చెప్పకుండా నాకు చిరాకు తెప్పించావు. నేను సెట్​కు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతా" అంటూ గర్వంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంటూ పోస్ట్ పెట్టింది ఇరా ఖాన్.

1862 కాలం నాటి ఓ రాజు కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సిద్దార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహిస్తుండగా.. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్​గా చేస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

బాలీవుడ్ మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. జునైద్ సోదరి ఇరా ఖాన్​ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

జునైద్​కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న ఓ ఫొటోను షేర్ చేసిన ఇరా ఖాన్.. 'ఇదే నీకు షూటింగ్​లో మొదటి రోజు' అంటూ రాసుకొచ్చింది. "జున్నూ ఇది నీకు మొదటి నాటకం, మొదటి షో, లేదా మనిద్దరం కలిసి చేసిన మొదటి నాటకం కాదు. కానీ షూటింగ్​లో ఇది నీకు మొదటి రోజు. ఈ ఫొటో నాకు చాలా ఇష్టం. చాలా ఏళ్లుగా నువ్వు నటిస్తున్నా.. ఇది నాకు కొత్తగానే ఉంది. నీ నటన పట్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. సినిమా గురించి ఏ విషయం చెప్పకుండా నాకు చిరాకు తెప్పించావు. నేను సెట్​కు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతా" అంటూ గర్వంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంటూ పోస్ట్ పెట్టింది ఇరా ఖాన్.

1862 కాలం నాటి ఓ రాజు కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సిద్దార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహిస్తుండగా.. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్​గా చేస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.