ETV Bharat / science-and-technology

జపాన్​ చేతికి క్యాప్సూల్​- గ్రహశకల నమూనాలపై పరిశోధన! - హయబూజ2 స్పేస్​క్రాఫ్ట్​

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహశకలం నమూనాలతో విజయవంతంగా భూమికి వచ్చిన క్యాప్యూల్​ జపాన్​ శాస్త్రవేత్తలకు అందింది. త్వరలోనే దీనిపై పరిశోధనలు జరపనున్నారు. సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను కనుగొనాలని భావిస్తున్నారు.

Capsule with asteroid samples arrives in Japan for research
జపాన్​ చేతికి గ్రహశకల నమూనాలు- పరిశోధనెప్పుడు?
author img

By

Published : Dec 8, 2020, 9:21 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాలతో కూడిన క్యాప్సూల్​ జపాన్​ చేతికి చేరింది. దీనిపై పరిశోధనలు జరిపి.. సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను కనుగొనాలని భావిస్తోంది ఆ దేశం​.

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. శనివారం భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్సూల్​ను హయబుసా-2 విడిచిపెట్టింది. అది ఆస్ట్రేలియా గడ్డ మీద పడింది. ఆ క్యాప్సూల్​నే జపాన్​కు అందించింది ఆస్ట్రేలియా.

Capsule with asteroid samples arrives in Japan for research
క్యాప్సూల్​ ఇదే

ఉల్క ఉపరితలం కింది భాగం నుంచి సేకరించిన సమూనాల్లో 4.6 బిలియన్​ సంవత్సరాలకు సంబంధించిన డేటా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే పరిశోధనలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నమూనాలను సంగమిహారా కేంద్రంలో ఉంచినట్టు స్పష్టం చేశారు. తమ అధ్యయనం ముగిసిన అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఈ నమూనాలను పంచుకోనున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:- ఆ గ్రహశకల నమూనాల్లో ఉన్న రహస్యాలేంటి?

సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాలతో కూడిన క్యాప్సూల్​ జపాన్​ చేతికి చేరింది. దీనిపై పరిశోధనలు జరిపి.. సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను కనుగొనాలని భావిస్తోంది ఆ దేశం​.

భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. శనివారం భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్సూల్​ను హయబుసా-2 విడిచిపెట్టింది. అది ఆస్ట్రేలియా గడ్డ మీద పడింది. ఆ క్యాప్సూల్​నే జపాన్​కు అందించింది ఆస్ట్రేలియా.

Capsule with asteroid samples arrives in Japan for research
క్యాప్సూల్​ ఇదే

ఉల్క ఉపరితలం కింది భాగం నుంచి సేకరించిన సమూనాల్లో 4.6 బిలియన్​ సంవత్సరాలకు సంబంధించిన డేటా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే పరిశోధనలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నమూనాలను సంగమిహారా కేంద్రంలో ఉంచినట్టు స్పష్టం చేశారు. తమ అధ్యయనం ముగిసిన అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఈ నమూనాలను పంచుకోనున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:- ఆ గ్రహశకల నమూనాల్లో ఉన్న రహస్యాలేంటి?

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.