ETV Bharat / priya

టేస్టీ 'ఉప్పు హుళి' దోశ.. గంటలో తయారు చేసేయండిలా..

author img

By

Published : Nov 9, 2021, 4:16 PM IST

దోశలంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ కొన్ని గంటల పాటు పిండిని పులవబెట్టుకోవాలంటే అన్నిసార్లు సాధ్యం కాదు. అందుకే ఆ స్థానంలో ఇన్​స్టాంట్​ దోశలు వచ్చేశాయి. మరి రుచికరమైన దోశలను కొన్ని నిమిషాల వ్యవధిలో ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..

instant dosa recipe
పిండి పులియబెట్టకుండానే టేస్టీ దోశలు తయారు చేసేయండి ఇలా..

మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ.. ఇలా చెప్పుకుంటూపోతే దోశల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే వీటిలో 'ఉప్పు హుళి దోశ'కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఉడిపి హోటళ్లలో ఎక్కువగా లభించే ఈ దోశ కోసం జనం బారులు తీరుతారు. ఆ దోశ రుచి అలాంటిది. ఈ దోశకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దీనిని తయారు చేసుకునేందుకు పట్టే సమయం కూడా మిగతా దోశల తయారీతో పోలిస్తే చాలా తక్కువ. పిండి పులవపెట్టకపోయినా కూడా చింతపండు కలిపి ఈ దోశలను తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు : బియ్యం, మినపప్పు, చింతపండు, బెల్లం, కొబ్బరితురుము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నూనె, కారం, ఇంగువ, ఉప్పు

తయారు చేసే విధానం..

ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులు, చింతపండు నానపెట్టుకోవాలి. బియ్యం ఎంత నానపెడితే అందులో ఒక్కవంతు మినపప్పు నానపెట్టాలి. సాధారణంగా దోశలకైతే గంటల తరబడి నానపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ దోశల తయారీకి కేవలం గంట-గంటన్నర ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది.

నానపెట్టిన బియ్యంలో జీలకర్ర, కాస్తంత ఇంగువ, నానపెట్టిన మెంతులు, ఎండుమిరపకాయలు, నానపెట్టిన మినపప్పు, కొబ్బరితురుము వేయాలి. ఇందులో కాస్తంత రుచికి బెల్లంతో పాటు ఉప్పు కూడా కలపాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు నానపెట్టిన చింతపండు వేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రుబ్బి దోశపిండిని తయారు చేసుకోవాలి. సిద్ధమైన పిండిని పెనంపై దోశలుగా వేసుకుని నూనెతో కాల్చి, కాస్తంత కారం వేసుకుంటే టెస్టీ ఉప్పు హుళి దోశలు రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : 'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం!

మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ.. ఇలా చెప్పుకుంటూపోతే దోశల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే వీటిలో 'ఉప్పు హుళి దోశ'కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఉడిపి హోటళ్లలో ఎక్కువగా లభించే ఈ దోశ కోసం జనం బారులు తీరుతారు. ఆ దోశ రుచి అలాంటిది. ఈ దోశకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దీనిని తయారు చేసుకునేందుకు పట్టే సమయం కూడా మిగతా దోశల తయారీతో పోలిస్తే చాలా తక్కువ. పిండి పులవపెట్టకపోయినా కూడా చింతపండు కలిపి ఈ దోశలను తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు : బియ్యం, మినపప్పు, చింతపండు, బెల్లం, కొబ్బరితురుము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నూనె, కారం, ఇంగువ, ఉప్పు

తయారు చేసే విధానం..

ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులు, చింతపండు నానపెట్టుకోవాలి. బియ్యం ఎంత నానపెడితే అందులో ఒక్కవంతు మినపప్పు నానపెట్టాలి. సాధారణంగా దోశలకైతే గంటల తరబడి నానపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ దోశల తయారీకి కేవలం గంట-గంటన్నర ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది.

నానపెట్టిన బియ్యంలో జీలకర్ర, కాస్తంత ఇంగువ, నానపెట్టిన మెంతులు, ఎండుమిరపకాయలు, నానపెట్టిన మినపప్పు, కొబ్బరితురుము వేయాలి. ఇందులో కాస్తంత రుచికి బెల్లంతో పాటు ఉప్పు కూడా కలపాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు నానపెట్టిన చింతపండు వేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రుబ్బి దోశపిండిని తయారు చేసుకోవాలి. సిద్ధమైన పిండిని పెనంపై దోశలుగా వేసుకుని నూనెతో కాల్చి, కాస్తంత కారం వేసుకుంటే టెస్టీ ఉప్పు హుళి దోశలు రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : 'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.