ETV Bharat / opinion

'కొత్త విద్యా విధానం… పెను మార్పులకు శ్రీకారం'

కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వస్తే పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గణనీయమైన మార్పులకు అవకాశం ఉంటుందన్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, జేసీ బోస్ ఫెలో ప్రొఫెసర్ అప్పారావు పొదిలి. కేంద్రానికి కస్తూరిరంగన్ కమిటీ ప్రతిపాదించిన విధానంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

author img

By

Published : Aug 4, 2020, 5:40 PM IST

the-new-education
కొత్త విద్యా విధానం

ఎన్నో ఆకాంక్షలతో ముందుకెళ్తున్న ఈ దేశంలో విద్యా వ్యవస్థకు మరింత పదునుపెట్టడానికి కేంద్ర కేబినెట్​ ఇటీవల ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. విద్యావ్యవస్థను ప్రక్షాళించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మెచ్చుకోదగ్గదే. డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ సూచించిన విద్యా విధానం... ప్రస్తుత వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది. విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది.

యువత ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను సరైన రీతిలో అంచనా వేసి కేంద్రం నూతన విద్యా విధానానికి అమోదం తెలిపింది. భారతీయ యువత విద్య కోసం ఇతర దేశాలకు వలస పోకుండా నిరోధించేందుకే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.

మాతృభాషకు పెద్దపీట

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక మార్పులు వస్తాయి. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యను అందించాలని, వీలైతే ఉన్నత తరగతులకు విస్తరించాలని ప్రభుత్వం కేంద్రం సూచించడం గొప్ప విషయం. అనేక చిన్న దేశాలు తమ మాతృభాషలో బోధనా విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందాయి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, చైనా మొదలైన దేశాలు ఇందుకు మంచి ఉదాహరణలు.

డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ ఉన్నత విద్య కోసం ప్రతిపాదించిన మార్పులు విద్యార్థులు, పరిశోధకులకు ఎంతగానో దోహదపడతాయి. నూతన విద్యా విధానం ప్రకారం డిగ్రీ మూడు లేదా నాలుగు సంవత్సరాలు.. పీజీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉంటుంది. అయితే నాలుగు సంవత్సరాలు డిగ్రీ చదివే విద్యార్థి తన ఆసక్తిని బట్టి అతడు నేరుగా పీహెచ్​డీలో చేరే అవకాశాన్ని కొత్త విధానం కల్పిస్తోంది. ఇంకా అనేక సౌలభ్యాలు నూతన విద్యా విధానంలో ఉన్నాయి.

విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా లేని స్వయం ప్రతిపత్తి కళాశాలలను ప్రోత్సహించడానికి నాణ్యమైన విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కస్తూరిరంగన్ కమిటీ సూచించింది. స్వయం ప్రతిపత్తి పొందాలనుకనే కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శాలను కూడా కమిటీ సూచించింది.

కొవిడ్-19 సంక్షోభాన్ని అవకాశంగా..

ప్రస్తుత కరోనా సమయంలో నూతన విద్యా విధానాన్ని కేంద్రం అవకాశంగా మలుచుకోవాలి. కొవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. చేస్తూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యార్థులకు ఆటంకాలు లేని అవకాశాలను అందించాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అలా చేయడం వల్ల విద్యావ్యవస్థలో 2035 నాటికి 50శాతం జీఈఆర్ ను సాధించాలనే కల బహుశా ముందే నెరవేరవచ్చు.

అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆన్‌లైన్ విద్యపై లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు మూస విధానాలను పక్కన పెట్టి, కొత్త పద్ధతులను అలవర్చుకోవాలి. ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే కేంద్ర సదుద్దేశం ప్రశంసనీయం.

(ప్రొఫెసర్ పొదిలి అప్పారావు, వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)

ఎన్నో ఆకాంక్షలతో ముందుకెళ్తున్న ఈ దేశంలో విద్యా వ్యవస్థకు మరింత పదునుపెట్టడానికి కేంద్ర కేబినెట్​ ఇటీవల ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. విద్యావ్యవస్థను ప్రక్షాళించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మెచ్చుకోదగ్గదే. డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ సూచించిన విద్యా విధానం... ప్రస్తుత వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది. విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది.

యువత ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను సరైన రీతిలో అంచనా వేసి కేంద్రం నూతన విద్యా విధానానికి అమోదం తెలిపింది. భారతీయ యువత విద్య కోసం ఇతర దేశాలకు వలస పోకుండా నిరోధించేందుకే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.

మాతృభాషకు పెద్దపీట

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక మార్పులు వస్తాయి. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యను అందించాలని, వీలైతే ఉన్నత తరగతులకు విస్తరించాలని ప్రభుత్వం కేంద్రం సూచించడం గొప్ప విషయం. అనేక చిన్న దేశాలు తమ మాతృభాషలో బోధనా విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందాయి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, చైనా మొదలైన దేశాలు ఇందుకు మంచి ఉదాహరణలు.

డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ ఉన్నత విద్య కోసం ప్రతిపాదించిన మార్పులు విద్యార్థులు, పరిశోధకులకు ఎంతగానో దోహదపడతాయి. నూతన విద్యా విధానం ప్రకారం డిగ్రీ మూడు లేదా నాలుగు సంవత్సరాలు.. పీజీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉంటుంది. అయితే నాలుగు సంవత్సరాలు డిగ్రీ చదివే విద్యార్థి తన ఆసక్తిని బట్టి అతడు నేరుగా పీహెచ్​డీలో చేరే అవకాశాన్ని కొత్త విధానం కల్పిస్తోంది. ఇంకా అనేక సౌలభ్యాలు నూతన విద్యా విధానంలో ఉన్నాయి.

విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా లేని స్వయం ప్రతిపత్తి కళాశాలలను ప్రోత్సహించడానికి నాణ్యమైన విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కస్తూరిరంగన్ కమిటీ సూచించింది. స్వయం ప్రతిపత్తి పొందాలనుకనే కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శాలను కూడా కమిటీ సూచించింది.

కొవిడ్-19 సంక్షోభాన్ని అవకాశంగా..

ప్రస్తుత కరోనా సమయంలో నూతన విద్యా విధానాన్ని కేంద్రం అవకాశంగా మలుచుకోవాలి. కొవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. చేస్తూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యార్థులకు ఆటంకాలు లేని అవకాశాలను అందించాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అలా చేయడం వల్ల విద్యావ్యవస్థలో 2035 నాటికి 50శాతం జీఈఆర్ ను సాధించాలనే కల బహుశా ముందే నెరవేరవచ్చు.

అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆన్‌లైన్ విద్యపై లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు మూస విధానాలను పక్కన పెట్టి, కొత్త పద్ధతులను అలవర్చుకోవాలి. ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే కేంద్ర సదుద్దేశం ప్రశంసనీయం.

(ప్రొఫెసర్ పొదిలి అప్పారావు, వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.