ETV Bharat / opinion

నిరపాయంగా 'హరిత' టపాసులు- ఆహ్లాద దీపావళికి బాటలు

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి రోజు రాత్రి, ఆ మరునాడు వాయుకాలుష్య సూచీలు మిన్నంటుతాయి. టపాసుల అమ్మకాలపై న్యాయస్థానాలు ప్రతిసారీ ఆంక్షలు విధించడం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం మామూలైపోయింది. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్దగా హానిచేయని హరిత టపాసులనే విక్రయించేలా చూడాలన్న సర్వోన్నత న్యాయస్థానం (sc verdict on firecrackers) సూచన ఆచరణీయం.

author img

By

Published : Oct 31, 2021, 7:01 AM IST

sc on firecrackers
హరిత టపాసులు

దీపావళి అంటేనే భారతీయ లోగిళ్లలో వెలుగుపూలు నింపే పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చి సందడిగా గడుపుతారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి రోజు రాత్రి, ఆ మరునాడు వాయుకాలుష్య సూచీలు మిన్నంటుతాయి. టపాసుల అమ్మకాలపై న్యాయస్థానాలు ప్రతిసారీ ఆంక్షలు విధించడం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం మామూలైపోయింది. ఈసారి మాత్రం దేశ సర్వోన్నత న్యాయస్థానం విభిన్నంగా స్పందించింది. మొత్తం మతాబులన్నింటినీ నిషేధించకుండా హరిత టపాసులను (sc on ban on firecrackers) అమ్మేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తద్వారా మామూలు టపాసుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించింది.

ఆరోగ్యానికి హాని

దీపావళి అంటే టపాసుల పండగగా మారిపోయిందిగానీ, దాని అసలు (climate pollution causes) ఉద్దేశం అంధకార తిమిరాన్ని జయించేందుకు దీపాల వరసలు పెట్టడం. మొదట్లో ఉప్పుపొట్లాలవంటి సాధారణ టపాసులతో మొదలైన సందడి, పోనుపోను రసాయనాల వాడకంతో వచ్చే కాంతి, శబ్దాలకు అంతా ఆకర్షితులు కావడంతో పెద్ద మతాబుల పరిశ్రమగా మారిపోయింది. రెండేళ్ల క్రితం ఇండియాలో అయిదేళ్లలోపు చిన్నారుల్లో 1.16 లక్షల మంది అకాల మృత్యువాతపడ్డారు. అందులో సగానికి పైగా మరణాలకు వాయుకాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. కేవలం దీపావళి టపాసుల వల్లే మొత్తం వాయుకాలుష్యం సంభవిస్తోందని చెప్పలేముగానీ, అందుకు ఇదీ ఒక కారణం. టపాసుల నుంచి సల్ఫర్‌, నైట్రోజన్‌ డయాక్సైడులు, మాంగనీస్‌, బెరీలియం వంటి 15 రకాల విషపూరిత పదార్థాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె, కళ్లు... ఇలా అన్ని అవయవాలపై ప్రభావం చూపుతాయి. టపాసుల నుంచి వెలువడే అతి సూక్ష్మ ధూళికణాలు (పీఎం2.5) ఆరోగ్యానికి మరింత కీడుచేస్తాయి. ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడేవారికి దీపావళి టపాసుల వల్ల కలిగే కాలుష్యం మరింత హానిచేస్తుంది. టపాసుల వల్ల వెలువడే శబ్ద కాలుష్యం గుండె సమస్యలు ఉన్నవారిని మరింత ఇబ్బందిపెడుతుంది. భారీ శబ్దాలను చిన్నపిల్లలు తట్టుకోలేరు. ఇటీవలి కాలంలో రంగురంగుల కాంతులను వెదజల్లే టపాసులు వస్తున్నాయి. అవి పేలినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు వెలువడతాయి. వాటివల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. మతాబులను కాల్చే సమయంలో గర్భిణులు బయటకు రాకపోవడం మంచిదన్నది వైద్యవర్గాల సూచన. ఆ సమయంలో గాలిలోకి వెలువడే రసాయనాల వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలపైనా ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

దీపావళి టపాసుల నిషేధం విషయంలో తాము ఎవరికీ వ్యతిరేకం కాదని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా స్పష్టం చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తన ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని పేర్కొంది. నిషేధిత టపాసులను ఎక్కడ అమ్మినా అందుకు ఆయా ప్రాంతాల పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు బాధ్యులవుతారని కఠినంగా హెచ్చరించింది. దీపావళి సమీపిస్తున్న సమయంలో కాకుండా, అంతకు చాలా రోజుల ముందు నుంచే తగిన చర్యలు తీసుకుంటే టపాసులను నివారించడానికి అవకాశం దక్కుతుంది.

చైతన్యం అవసరం

ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్దగా హానిచేయని హరిత టపాసులనే విక్రయించేలా చూడాలన్న సర్వోన్నత న్యాయస్థానం సూచన (sc verdict on firecrackers) ఆచరణీయం. మొదట పంజాబ్‌లోని భారతీయ శాస్త్ర విద్య, పరిశోధన సంస్థ(ఐఐఎస్‌ఈఆర్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ సమ్రాట్‌ ఘోష్‌ వీటి తయారీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) సైతం ప్రత్యామ్నాయ ముడిపదార్థాలతో హరిత టపాసులను అభివృద్ధి చేసింది. వీటివల్ల పొగ, సూక్ష్మ ధూళికణాలు 30శాతం, సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు 20శాతం తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హరిత టపాసుల తయారీలో పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌, అల్యూమినియం వంటి పదార్థాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. ఫలితంగా ఆరోగ్యానికి కలిగే ముప్పు చాలావరకూ పరిమితం అవుతుంది. వాటి ధర సైతం సంప్రదాయ టపాసుల కంటే తక్కువ. సర్వోన్నత న్యాయస్థానం సూచనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలే చొరవచూపాలి. క్షేత్రస్థాయి వ్యాపారవర్గాల్లో ఈ దిశగా అవగాహన కల్పించాలి. ప్రజలనూ చైతన్యవంతులను చేయాలి. హరిత టపాసుల పరిజ్ఞానాన్ని శివకాశి వంటి ప్రాంతాల్లో ఉన్న బాణసంచా తయారీదారులకు అందించి, వాటినే తయారు చేసేలా ప్రోత్సహించాలి. వీలైనంతవరకు టపాసుల తయారీలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు సైతం కల్పించాలి. పండగ సరదాలు కాదనలేనివే. ఆరోగ్యానికి పొగపెట్టేలా అవి మారకూడదన్న అంశాన్నీ విస్మరించకూడదు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, అందరూ ఆనందించేలా పండగ జరుపుకోవడం ముఖ్యం. సుప్రీం మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించి, హరిత టపాసులను ప్రోత్సహిస్తే ఇకపై సరికొత్త దీపావళికి శ్రీకారం చుట్టినట్లవుతుంది.

- కామేశ్‌

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

దీపావళి అంటేనే భారతీయ లోగిళ్లలో వెలుగుపూలు నింపే పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చి సందడిగా గడుపుతారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి రోజు రాత్రి, ఆ మరునాడు వాయుకాలుష్య సూచీలు మిన్నంటుతాయి. టపాసుల అమ్మకాలపై న్యాయస్థానాలు ప్రతిసారీ ఆంక్షలు విధించడం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం మామూలైపోయింది. ఈసారి మాత్రం దేశ సర్వోన్నత న్యాయస్థానం విభిన్నంగా స్పందించింది. మొత్తం మతాబులన్నింటినీ నిషేధించకుండా హరిత టపాసులను (sc on ban on firecrackers) అమ్మేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తద్వారా మామూలు టపాసుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించింది.

ఆరోగ్యానికి హాని

దీపావళి అంటే టపాసుల పండగగా మారిపోయిందిగానీ, దాని అసలు (climate pollution causes) ఉద్దేశం అంధకార తిమిరాన్ని జయించేందుకు దీపాల వరసలు పెట్టడం. మొదట్లో ఉప్పుపొట్లాలవంటి సాధారణ టపాసులతో మొదలైన సందడి, పోనుపోను రసాయనాల వాడకంతో వచ్చే కాంతి, శబ్దాలకు అంతా ఆకర్షితులు కావడంతో పెద్ద మతాబుల పరిశ్రమగా మారిపోయింది. రెండేళ్ల క్రితం ఇండియాలో అయిదేళ్లలోపు చిన్నారుల్లో 1.16 లక్షల మంది అకాల మృత్యువాతపడ్డారు. అందులో సగానికి పైగా మరణాలకు వాయుకాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. కేవలం దీపావళి టపాసుల వల్లే మొత్తం వాయుకాలుష్యం సంభవిస్తోందని చెప్పలేముగానీ, అందుకు ఇదీ ఒక కారణం. టపాసుల నుంచి సల్ఫర్‌, నైట్రోజన్‌ డయాక్సైడులు, మాంగనీస్‌, బెరీలియం వంటి 15 రకాల విషపూరిత పదార్థాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె, కళ్లు... ఇలా అన్ని అవయవాలపై ప్రభావం చూపుతాయి. టపాసుల నుంచి వెలువడే అతి సూక్ష్మ ధూళికణాలు (పీఎం2.5) ఆరోగ్యానికి మరింత కీడుచేస్తాయి. ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడేవారికి దీపావళి టపాసుల వల్ల కలిగే కాలుష్యం మరింత హానిచేస్తుంది. టపాసుల వల్ల వెలువడే శబ్ద కాలుష్యం గుండె సమస్యలు ఉన్నవారిని మరింత ఇబ్బందిపెడుతుంది. భారీ శబ్దాలను చిన్నపిల్లలు తట్టుకోలేరు. ఇటీవలి కాలంలో రంగురంగుల కాంతులను వెదజల్లే టపాసులు వస్తున్నాయి. అవి పేలినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు వెలువడతాయి. వాటివల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. మతాబులను కాల్చే సమయంలో గర్భిణులు బయటకు రాకపోవడం మంచిదన్నది వైద్యవర్గాల సూచన. ఆ సమయంలో గాలిలోకి వెలువడే రసాయనాల వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలపైనా ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

దీపావళి టపాసుల నిషేధం విషయంలో తాము ఎవరికీ వ్యతిరేకం కాదని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా స్పష్టం చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తన ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని పేర్కొంది. నిషేధిత టపాసులను ఎక్కడ అమ్మినా అందుకు ఆయా ప్రాంతాల పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు బాధ్యులవుతారని కఠినంగా హెచ్చరించింది. దీపావళి సమీపిస్తున్న సమయంలో కాకుండా, అంతకు చాలా రోజుల ముందు నుంచే తగిన చర్యలు తీసుకుంటే టపాసులను నివారించడానికి అవకాశం దక్కుతుంది.

చైతన్యం అవసరం

ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్దగా హానిచేయని హరిత టపాసులనే విక్రయించేలా చూడాలన్న సర్వోన్నత న్యాయస్థానం సూచన (sc verdict on firecrackers) ఆచరణీయం. మొదట పంజాబ్‌లోని భారతీయ శాస్త్ర విద్య, పరిశోధన సంస్థ(ఐఐఎస్‌ఈఆర్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ సమ్రాట్‌ ఘోష్‌ వీటి తయారీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) సైతం ప్రత్యామ్నాయ ముడిపదార్థాలతో హరిత టపాసులను అభివృద్ధి చేసింది. వీటివల్ల పొగ, సూక్ష్మ ధూళికణాలు 30శాతం, సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు 20శాతం తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హరిత టపాసుల తయారీలో పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌, అల్యూమినియం వంటి పదార్థాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. ఫలితంగా ఆరోగ్యానికి కలిగే ముప్పు చాలావరకూ పరిమితం అవుతుంది. వాటి ధర సైతం సంప్రదాయ టపాసుల కంటే తక్కువ. సర్వోన్నత న్యాయస్థానం సూచనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలే చొరవచూపాలి. క్షేత్రస్థాయి వ్యాపారవర్గాల్లో ఈ దిశగా అవగాహన కల్పించాలి. ప్రజలనూ చైతన్యవంతులను చేయాలి. హరిత టపాసుల పరిజ్ఞానాన్ని శివకాశి వంటి ప్రాంతాల్లో ఉన్న బాణసంచా తయారీదారులకు అందించి, వాటినే తయారు చేసేలా ప్రోత్సహించాలి. వీలైనంతవరకు టపాసుల తయారీలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు సైతం కల్పించాలి. పండగ సరదాలు కాదనలేనివే. ఆరోగ్యానికి పొగపెట్టేలా అవి మారకూడదన్న అంశాన్నీ విస్మరించకూడదు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, అందరూ ఆనందించేలా పండగ జరుపుకోవడం ముఖ్యం. సుప్రీం మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించి, హరిత టపాసులను ప్రోత్సహిస్తే ఇకపై సరికొత్త దీపావళికి శ్రీకారం చుట్టినట్లవుతుంది.

- కామేశ్‌

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.