ETV Bharat / opinion

నేపాల్ చరిత్ర... ఇదే అసలైన కాలాపానీ కథ!

author img

By

Published : Jul 21, 2020, 2:37 PM IST

కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్..​. భారత్-నేపాల్ మధ్య ఇటీవల వివాదం ప్రారంభమైనప్పుడు తెగ వినిపించిన పేర్లివి. భారత్​ భూభాగంలోని ఈ ప్రాంతాలు మావేనంటూ నేపాల్ చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. వీటిని తమ భూభాగంలో చూపించుకోవడానికి ఏకంగా తమ రాజ్యాంగాన్నే సవరించింది. మరి అసలు ఈ వివాదానికి మూలమేంటి? తన అధీనంలో లేకపోయినా దీనిపై హక్కులను ప్రకటించుకోవడానికి కారణమేంటి? అసలు ఈ ప్రాంతాల చరిత్రేంటి?

Sagauli treaty of Nepal, more than a bend in the river
నేపాల్ – ఒక చిన్న నది మలుపు లోని దేశం కాదు మిక్కిలి చరిత్ర కలది!!

నేపాల్​కు చెందిన గూర్ఖా యోధులు భారత సైన్యంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నారు. వీరి పూర్వీకులు 1765లోనే యూరోపియన్ల ఆయుధాలు వినియోగించారు. గూర్ఖా రాజ్యాన్ని పాలించే రాజు పృథ్వీ నారాయణ్ నాయకత్వంలో పర్వత ప్రాంతాల్లో ఉన్న వివిధ తెగల కన్నా బలీయమైన శక్తిమంతులుగా తమను తాము తయారు చేసుకోవడం ప్రారంభించారు. పృథ్వీ నారాయణ్ మరణించిన తరువాత వితంతువైన అతని భార్య, సోదరుడు రాజ ప్రతినిధులుగా వ్యవహరించారు. శిశువుగా ఉన్న పృథ్వీ కుమారుడి పేరుమీదుగా పాలన సాగించారు. వీరి నాయకత్వంలో కాఠ్​మాండూ, లలితపతన్, భట్‌గావ్‌లను లొంగదీసుకుని కుమావున్ వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1790లో అల్మోరాను స్వాధీనం చేసుకున్నారు. రామ్‌గంగా వరకు దేశం మొత్తానికి తమను తాము ప్రభువులుగా ప్రకటించుకున్నారు.

చైనా దాడితో వెనక్కి

గూర్ఖాలు.. కుమావున్ నుంచి తమ జైత్రయాత్రను పశ్చిమ దిశగా కొనసాగిస్తూ గర్హ్వాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓ వైపు నేపాల్​పై చైనా దాడి చేసిందన్న వార్తను ఆలస్యంగా తెలుసుకుంది గూర్ఖాల ఆక్రమణ దళం. దీంతో గర్హ్వాల్ నుంచి వైదొలిగి తమ దేశాన్ని రక్షించుకోవడానికే పరిమితమైపోయింది. అయితే, కొన్ని సంవత్సరాల తరువాత గూర్ఖా దండయాత్ర మళ్లీ పశ్చిమ దిశగా కొనసాగింది. అప్పటి గర్హ్వాల్ రాజు పాలనలో ఉన్న శ్రీనగర్​పై ఫిబ్రవరి 1803లో దాడికి దిగారు. దీంతో ఆ రాజు దక్షిణ దిశగా వెనక్కి తగ్గాడు. అతను బరాహత్ ప్రాంతంవైపు వెళ్లినా పెద్దగా లాభం లేకుండా పోయింది. అతన్ని అక్కడి నుంచి తరిమేయగా, మొదట డూన్​లోకి, ఆ తర్వాత సహరంపూర్​కు వెళ్లారు.

ఓడి, మరణించి...

ఇలా తీవ్రమైన అలజడితో వేధింపులకు గురైన రాజా ప్రద్యుమ్న షా ఇక్కడ తన ఆస్తి, సింహాసనం అంతా తాకట్టుపెట్టి లక్షల రూపాయలను సమీకరించాడు. ఈ నిధులతో అతను ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని డూన్ వద్దకు తిరిగి వచ్చి ఉమర్ సింగ్ థాపా ఆధ్వర్యంలో డెహ్రాను ఆక్రమించిన వారిపై దాడి చేశాడు. కానీ అతను ఓడిపోయి, ప్రత్యర్థుల చేతిలో మరణించాడు.

ప్రద్యుమ్న షా దుస్థితి, గుర్ఖాల ఆధిపత్యం, చివరకు బ్రిటిష్ వారు లొంగదీసుకున్న క్రమాన్ని పాలిఘర్ పురోహితులు(యమునోత్రికి సమీపంలో పవిత్రమైన కోనల్లో ఉండేవారు) ముందుగానే జోస్యం చెప్పారని జేబీ ఫ్రాసేర్ తన పుస్తకం 'హిమాలయన్ మౌంటెన్స్'లో ప్రస్తావించారు.

గూర్ఖా జైత్రయాత్ర ఆ పర్వత ప్రాంతాల ఉత్తర వాలుపైకి చేరినట్లే.. బ్రిటీష్ దళాలు శివాలిక్ శ్రేణులలో ఉన్న దక్షిణ ప్రదేశాలకు చేరుకున్నాయి. 1803 అక్టోబర్‌లో ఉమర్ సింగ్ థాపా డెహ్రాను ఆక్రమించిన సమయంలోనే కర్నల్ బర్న్ సహరన్‌పూర్​లోకి చేరుకున్నారు.

క్రూరమైన పాలన

గూర్ఖాల పాలన క్రూరంగా సాగింది. దీన్ని తట్టుకోలేక చాలా మంది ప్రజలు వలస బాటపట్టారు. బానిసత్వ మేఘాలు త్వరితగతిన కమ్ముకున్నాయి. అప్పు తిరిగి చెల్లించలేని వారు జీవితకాల బానిసత్వ బంధనంలో ఇరుక్కుపోయారు. అన్యాయం, క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పు చెల్లించలేకపోతే వారి కుటుంబాల తలలను పాలకులకు తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. వాస్తవానికి 'గూర్ఖానీ' అనేది గర్హ్వాల్​లో గూర్ఖా మితిమీరిన చేష్టలకు పర్యాయపదంగా మారింది.

యుద్ధానికి అసలు కారణం

వివాదాస్పదమైన భూభాగంలో ఒక పోలీసు స్టేషన్‌ను ధ్వంసం చేయడం గూర్ఖా యుద్ధానికి తక్షణ కారణం అయినప్పటికీ, దరోగా ఇంచార్జ్ హత్యతో ఇది ప్రారంభమైంది. ఈ ఘటనలో 18 మంది కానిస్టేబుళ్లు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. కొద్ది సేపటికే మరో పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. ప్రతిచర్యకు దిగడానికి సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నేపాల్ రాజుకు గూర్ఖాలు ఉత్తరం రాశారు. దానికి అహంకారపూరితమైన జవాబు రావడం వల్ల 1814 నవంబర్ 1న యుద్ధం ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు 'విలియం మెమోయిర్ ఆఫ్ ద డూన్' అనే పుస్తకంలో కనిపిస్తాయి. కళింగ అని పిలిచే నలపాణి కొండపై కొంతమంది గూర్ఖాలు త్వరితగతిన కోట నిర్మించారు. ఇంత మొండి పట్టుదల ఉన్న, వీరోచితమైన ఘటనలు గత చరిత్రలో కనబడవు. డూన్ లోయలో, రిస్పానా ఒడ్డున ఉన్న రెండు చిన్న శాసనాల రాతి స్తంభాలు ఒక ప్రత్యేకమైన స్మారక చిహ్నంగా నిలుస్తాయి. ఇది విజయం సాధించిన వారితో పాటు ఓడిపోయినవారిని కూడా స్మరణకు తెస్తుంది. జనరల్ గిలెస్పీతో పాటు బల్​భద్దర్​ సింగ్ మరణం శౌర్యవంతులైన గూర్ఖాల నివాళిగా చరిత్రలో నిలిచిపోయాయి.

ఆక్రమణ చెల్లు

చివరకు సహరన్​పూర్ జిల్లాను 1815 నవంబర్ 17న జప్తు చేశారు. 1815లో బ్రిటీష్ జనరల్ ఓచెర్లోనీ గర్హ్వాల్, కుమావున్​లో కాళీ నది వెంబడి ఉన్న నేపాలీలను ఖాళీ చేయించి, వారి 12 ఏళ్ల ఆక్రమణకు చరమగీతం పాడారు. ఉత్తరాఖండ్‌ చరిత్రలో ఈ కాలం అసాధారణమైన క్రూరత్వం, అణచివేతల కాలంగానే గుర్తుండిపోతుంది. తూర్పున సిక్కింలో తీస్తా, పశ్చిమాన సట్లెజ్ నది మధ్య అన్ని భూములను నేపాలీలు ఆక్రమించారు.

సుగౌలీ ఒప్పందం

పరిష్కారం కోసం జరిగిన చర్చలలో 1815 డిసెంబర్​లో బిహార్​ చంపారన్​లోని సుగౌలి వద్ద ఓ ఒప్పందంపై నేపాల్, బ్రిటీష్ ఇండియా సంతకం చేశాయి. 1816 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతోపాటు తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఆక్రమించిన భూభాగాలన్నింటినీ ఈస్టిండియా కంపెనీకి అప్పజెప్పింది నేపాల్.

1815 డిసెంబర్ 2న జరిగిన ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ ఏర్పడింది. 1816 మార్చి 4 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలా ఈస్టిండియా కంపెనీ, రాజ్​గురు గజరాజ్ మిశ్రా.. నేపాల్​కు చెందిన చంద్రశేఖర్ ఉపాధ్యాయతో అంగీకారానికి వచ్చారు. ఈ విధంగా నేపాలీలు బ్రిటీష్ వారికి లొంగిపోయారనడానికి ఈ ఒప్పందమే నిదర్శనం. నేపాల్ పశ్చిమ భూభాగాన్ని ఈస్టిండియా కంపెనీకి అప్పగించింది.

సిక్కిం, టెరాయ్, కుమావున్, గర్హ్వాల్ ప్రాంతాలు బ్రిటీష్ అధీనంలోకి వెళ్లాయి. నేపాల్‌ను తిరిగి దాని అసలు సరిహద్దులకు నెట్టేశారు. ఉత్తరాఖండ్​లోని పిథోరాగఢ్ జిల్లాలో ఉన్న శారదా నది(నేపాలీలు మహాకాళి అని పిలుస్తారు)ని రెండు దేశాల సరిహద్దుగా నిర్ణయించారు. తూర్పున, పాత సరిహద్దు మెచీ నదిగా మారుతుంది. ఇది బిహార్‌లోని కిషన్​గంజ్ వద్ద ఉన్న మైదానాలకు పారుతుంది.

తాజా వివాదం

లిపులేఖ్​ పాస్ ద్వారా మానస సరోవర్ తీర్థయాత్ర దూరాన్ని తగ్గించడానికి భారత్​ నిర్మించిన రహదారి ప్రస్తుతం వివాదంగా మారింది. మహాకాళి నదికి మూడు ఉప నదులు ఉన్నాయి: ఉత్తరాఖండ్​ పిథోరాగఢ్​ జిల్లాలోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్. పశ్చిమాన ఉన్న లింపియాధురాను సరిహద్దుగా నేపాల్ పరిగణిస్తోంది. మరోవైపు భారత్​ మాత్రం లిపులేఖ్​ను సరిహద్దుగా గుర్తిస్తోంది.

ఈ వివాదం ఉత్పన్నమవ్వడానికి కారణం చిన్నదేమీ కాదు. నేపాల్​పై చైనా గట్టిపట్టు సాధించిన తరువాత ఆ దేశ కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఈ చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఏనుగులు పోరాడుతున్నప్పుడు, కలిగే అలజడితో కింద ఉన్న గడ్డి పరకలు నిర్దాక్షిణ్యంగా అణిగిపోతాయన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం నేపాల్ పరిస్థితి.

(రచయత- గణేష్ సెయిలీ)

నేపాల్​కు చెందిన గూర్ఖా యోధులు భారత సైన్యంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నారు. వీరి పూర్వీకులు 1765లోనే యూరోపియన్ల ఆయుధాలు వినియోగించారు. గూర్ఖా రాజ్యాన్ని పాలించే రాజు పృథ్వీ నారాయణ్ నాయకత్వంలో పర్వత ప్రాంతాల్లో ఉన్న వివిధ తెగల కన్నా బలీయమైన శక్తిమంతులుగా తమను తాము తయారు చేసుకోవడం ప్రారంభించారు. పృథ్వీ నారాయణ్ మరణించిన తరువాత వితంతువైన అతని భార్య, సోదరుడు రాజ ప్రతినిధులుగా వ్యవహరించారు. శిశువుగా ఉన్న పృథ్వీ కుమారుడి పేరుమీదుగా పాలన సాగించారు. వీరి నాయకత్వంలో కాఠ్​మాండూ, లలితపతన్, భట్‌గావ్‌లను లొంగదీసుకుని కుమావున్ వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1790లో అల్మోరాను స్వాధీనం చేసుకున్నారు. రామ్‌గంగా వరకు దేశం మొత్తానికి తమను తాము ప్రభువులుగా ప్రకటించుకున్నారు.

చైనా దాడితో వెనక్కి

గూర్ఖాలు.. కుమావున్ నుంచి తమ జైత్రయాత్రను పశ్చిమ దిశగా కొనసాగిస్తూ గర్హ్వాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓ వైపు నేపాల్​పై చైనా దాడి చేసిందన్న వార్తను ఆలస్యంగా తెలుసుకుంది గూర్ఖాల ఆక్రమణ దళం. దీంతో గర్హ్వాల్ నుంచి వైదొలిగి తమ దేశాన్ని రక్షించుకోవడానికే పరిమితమైపోయింది. అయితే, కొన్ని సంవత్సరాల తరువాత గూర్ఖా దండయాత్ర మళ్లీ పశ్చిమ దిశగా కొనసాగింది. అప్పటి గర్హ్వాల్ రాజు పాలనలో ఉన్న శ్రీనగర్​పై ఫిబ్రవరి 1803లో దాడికి దిగారు. దీంతో ఆ రాజు దక్షిణ దిశగా వెనక్కి తగ్గాడు. అతను బరాహత్ ప్రాంతంవైపు వెళ్లినా పెద్దగా లాభం లేకుండా పోయింది. అతన్ని అక్కడి నుంచి తరిమేయగా, మొదట డూన్​లోకి, ఆ తర్వాత సహరంపూర్​కు వెళ్లారు.

ఓడి, మరణించి...

ఇలా తీవ్రమైన అలజడితో వేధింపులకు గురైన రాజా ప్రద్యుమ్న షా ఇక్కడ తన ఆస్తి, సింహాసనం అంతా తాకట్టుపెట్టి లక్షల రూపాయలను సమీకరించాడు. ఈ నిధులతో అతను ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని డూన్ వద్దకు తిరిగి వచ్చి ఉమర్ సింగ్ థాపా ఆధ్వర్యంలో డెహ్రాను ఆక్రమించిన వారిపై దాడి చేశాడు. కానీ అతను ఓడిపోయి, ప్రత్యర్థుల చేతిలో మరణించాడు.

ప్రద్యుమ్న షా దుస్థితి, గుర్ఖాల ఆధిపత్యం, చివరకు బ్రిటిష్ వారు లొంగదీసుకున్న క్రమాన్ని పాలిఘర్ పురోహితులు(యమునోత్రికి సమీపంలో పవిత్రమైన కోనల్లో ఉండేవారు) ముందుగానే జోస్యం చెప్పారని జేబీ ఫ్రాసేర్ తన పుస్తకం 'హిమాలయన్ మౌంటెన్స్'లో ప్రస్తావించారు.

గూర్ఖా జైత్రయాత్ర ఆ పర్వత ప్రాంతాల ఉత్తర వాలుపైకి చేరినట్లే.. బ్రిటీష్ దళాలు శివాలిక్ శ్రేణులలో ఉన్న దక్షిణ ప్రదేశాలకు చేరుకున్నాయి. 1803 అక్టోబర్‌లో ఉమర్ సింగ్ థాపా డెహ్రాను ఆక్రమించిన సమయంలోనే కర్నల్ బర్న్ సహరన్‌పూర్​లోకి చేరుకున్నారు.

క్రూరమైన పాలన

గూర్ఖాల పాలన క్రూరంగా సాగింది. దీన్ని తట్టుకోలేక చాలా మంది ప్రజలు వలస బాటపట్టారు. బానిసత్వ మేఘాలు త్వరితగతిన కమ్ముకున్నాయి. అప్పు తిరిగి చెల్లించలేని వారు జీవితకాల బానిసత్వ బంధనంలో ఇరుక్కుపోయారు. అన్యాయం, క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పు చెల్లించలేకపోతే వారి కుటుంబాల తలలను పాలకులకు తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. వాస్తవానికి 'గూర్ఖానీ' అనేది గర్హ్వాల్​లో గూర్ఖా మితిమీరిన చేష్టలకు పర్యాయపదంగా మారింది.

యుద్ధానికి అసలు కారణం

వివాదాస్పదమైన భూభాగంలో ఒక పోలీసు స్టేషన్‌ను ధ్వంసం చేయడం గూర్ఖా యుద్ధానికి తక్షణ కారణం అయినప్పటికీ, దరోగా ఇంచార్జ్ హత్యతో ఇది ప్రారంభమైంది. ఈ ఘటనలో 18 మంది కానిస్టేబుళ్లు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. కొద్ది సేపటికే మరో పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. ప్రతిచర్యకు దిగడానికి సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నేపాల్ రాజుకు గూర్ఖాలు ఉత్తరం రాశారు. దానికి అహంకారపూరితమైన జవాబు రావడం వల్ల 1814 నవంబర్ 1న యుద్ధం ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు 'విలియం మెమోయిర్ ఆఫ్ ద డూన్' అనే పుస్తకంలో కనిపిస్తాయి. కళింగ అని పిలిచే నలపాణి కొండపై కొంతమంది గూర్ఖాలు త్వరితగతిన కోట నిర్మించారు. ఇంత మొండి పట్టుదల ఉన్న, వీరోచితమైన ఘటనలు గత చరిత్రలో కనబడవు. డూన్ లోయలో, రిస్పానా ఒడ్డున ఉన్న రెండు చిన్న శాసనాల రాతి స్తంభాలు ఒక ప్రత్యేకమైన స్మారక చిహ్నంగా నిలుస్తాయి. ఇది విజయం సాధించిన వారితో పాటు ఓడిపోయినవారిని కూడా స్మరణకు తెస్తుంది. జనరల్ గిలెస్పీతో పాటు బల్​భద్దర్​ సింగ్ మరణం శౌర్యవంతులైన గూర్ఖాల నివాళిగా చరిత్రలో నిలిచిపోయాయి.

ఆక్రమణ చెల్లు

చివరకు సహరన్​పూర్ జిల్లాను 1815 నవంబర్ 17న జప్తు చేశారు. 1815లో బ్రిటీష్ జనరల్ ఓచెర్లోనీ గర్హ్వాల్, కుమావున్​లో కాళీ నది వెంబడి ఉన్న నేపాలీలను ఖాళీ చేయించి, వారి 12 ఏళ్ల ఆక్రమణకు చరమగీతం పాడారు. ఉత్తరాఖండ్‌ చరిత్రలో ఈ కాలం అసాధారణమైన క్రూరత్వం, అణచివేతల కాలంగానే గుర్తుండిపోతుంది. తూర్పున సిక్కింలో తీస్తా, పశ్చిమాన సట్లెజ్ నది మధ్య అన్ని భూములను నేపాలీలు ఆక్రమించారు.

సుగౌలీ ఒప్పందం

పరిష్కారం కోసం జరిగిన చర్చలలో 1815 డిసెంబర్​లో బిహార్​ చంపారన్​లోని సుగౌలి వద్ద ఓ ఒప్పందంపై నేపాల్, బ్రిటీష్ ఇండియా సంతకం చేశాయి. 1816 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. దీంతోపాటు తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఆక్రమించిన భూభాగాలన్నింటినీ ఈస్టిండియా కంపెనీకి అప్పజెప్పింది నేపాల్.

1815 డిసెంబర్ 2న జరిగిన ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ ఏర్పడింది. 1816 మార్చి 4 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలా ఈస్టిండియా కంపెనీ, రాజ్​గురు గజరాజ్ మిశ్రా.. నేపాల్​కు చెందిన చంద్రశేఖర్ ఉపాధ్యాయతో అంగీకారానికి వచ్చారు. ఈ విధంగా నేపాలీలు బ్రిటీష్ వారికి లొంగిపోయారనడానికి ఈ ఒప్పందమే నిదర్శనం. నేపాల్ పశ్చిమ భూభాగాన్ని ఈస్టిండియా కంపెనీకి అప్పగించింది.

సిక్కిం, టెరాయ్, కుమావున్, గర్హ్వాల్ ప్రాంతాలు బ్రిటీష్ అధీనంలోకి వెళ్లాయి. నేపాల్‌ను తిరిగి దాని అసలు సరిహద్దులకు నెట్టేశారు. ఉత్తరాఖండ్​లోని పిథోరాగఢ్ జిల్లాలో ఉన్న శారదా నది(నేపాలీలు మహాకాళి అని పిలుస్తారు)ని రెండు దేశాల సరిహద్దుగా నిర్ణయించారు. తూర్పున, పాత సరిహద్దు మెచీ నదిగా మారుతుంది. ఇది బిహార్‌లోని కిషన్​గంజ్ వద్ద ఉన్న మైదానాలకు పారుతుంది.

తాజా వివాదం

లిపులేఖ్​ పాస్ ద్వారా మానస సరోవర్ తీర్థయాత్ర దూరాన్ని తగ్గించడానికి భారత్​ నిర్మించిన రహదారి ప్రస్తుతం వివాదంగా మారింది. మహాకాళి నదికి మూడు ఉప నదులు ఉన్నాయి: ఉత్తరాఖండ్​ పిథోరాగఢ్​ జిల్లాలోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్. పశ్చిమాన ఉన్న లింపియాధురాను సరిహద్దుగా నేపాల్ పరిగణిస్తోంది. మరోవైపు భారత్​ మాత్రం లిపులేఖ్​ను సరిహద్దుగా గుర్తిస్తోంది.

ఈ వివాదం ఉత్పన్నమవ్వడానికి కారణం చిన్నదేమీ కాదు. నేపాల్​పై చైనా గట్టిపట్టు సాధించిన తరువాత ఆ దేశ కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఈ చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తోంది. ఏనుగులు పోరాడుతున్నప్పుడు, కలిగే అలజడితో కింద ఉన్న గడ్డి పరకలు నిర్దాక్షిణ్యంగా అణిగిపోతాయన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం నేపాల్ పరిస్థితి.

(రచయత- గణేష్ సెయిలీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.