ETV Bharat / opinion

నిధుల కోతతో బాలికా సంక్షేమం వెనుకంజ

author img

By

Published : Mar 2, 2021, 8:25 AM IST

కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతపడగా.. చేపట్టిన 'ఆన్‌లైన్‌ విద్య' ప్రభావం బాలురతో పోలిస్తే బాలికలపై తీవ్రంగా పడి, డిజిటల్‌ అంతరాలకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలికల విద్యా వికాసానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని  విద్యావేత్తలు అభిలషించినా, వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బాలికా విద్య విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బాలికల వికాసానికి ప్రత్యేక చొరవ తీసుకొని బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలి.

girl child education in india
నిధుల కోతతో బాలికా సంక్షేమం వెనకంజ

బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మహక్కు. ఈ హక్కును భారతీయ సమాజంలో బాలురతో సమానంగా బాలికలు పొందలేకపోతున్నారు. ఆడపిల్లను అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య బంధించడంతోపాటు లింగ విచక్షణ, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, భ్రూణ హత్యలు, హింస, వరకట్న సమస్య, పేదరికం, రక్తహీనత, పోషకాహార లోపం తదితర అంశాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తరవాత 30 శాతం, పదో తరగతి తరవాత 57 శాతం బాలికలు బడి మానేస్తున్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య కరోనా వల్ల మరింత పెరిగినట్లు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఆన్​లైన్ విద్య అందకుండా..
కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతపడటంతో చేపట్టిన 'ఆన్‌లైన్‌ విద్య' ప్రభావం బాలురతో పోలిస్తే బాలికలపై తీవ్రంగా పడి, డిజిటల్‌ అంతరాలకు దారి తీసింది. ఇంట్లో చదువు కోసం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ వంటి ఉపకరణాలను ఇవ్వడంలో బాలికల కంటే అబ్బాయిలకే ప్రాధాన్యమిచ్చారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఒక విద్యా సంబంధ సర్వేలో కోటి మంది బాలికలు బడి మానేసే అవకాశం ఉందని వెల్లడైంది. 37 శాతం అబ్బాయిలతో పోలిస్తే కేవలం 26 శాతం బాలికలే ఆన్‌లైన్‌ అధ్యయనాల కోసం స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాల సదుపాయాన్ని కలిగి ఉన్నారని, 71 శాతం బాలికలు ఇంట్లో, ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో కూడా ఇంటి పని చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, ఇది కేవలం 38 శాతం బాలురపై మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. మరోవైపు కుటుంబ పరిస్థితులు దిగజారడం వల్ల బాలికలు బాలకార్మికులుగా మారడం సహా బాల్య వివాహాలూ పెరిగాయి. అంతిమంగా బాలికల భద్రత, సంరక్షణ మరింత ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ ఏడాది కేటాయింపులేం లేవు..

ఇలాంటి పరిస్థితుల్లో బాలికల విద్యా వికాసానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యావేత్తలు అభిలషించినా, వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. లింగపరమైన దుర్విచక్షణను తొలగిస్తూ బాలికల నిష్పత్తిని పెంచేందుకు తోడ్పడే 'బేటీ బచావో, బేటీ పడావో' పథకం- బాలికలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఉన్నత విద్యాభ్యాసానికి చేయూతనిస్తుంది. ఇందులో ఇప్పటికే పలు ఇతర పథకాలను విలీనం చేశారు. ఈ పథకానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండేవి. ఈ ఏడాది ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం గమనార్హం. దీనికి బదులుగా, 'ప్రధానమంత్రి మాతృ వందన', 'మహిళాశక్తి కేంద్ర పరిశోధన' వంటి ఇతర పథకాలతో పాటు 'బేటీ బచావో- బేటీ పడావో'ను 'సమర్త్య యోజన' కింద కలిపి, ఉమ్మడిగా రూ.2,522 కోట్లు కేటాయించారు. ఈ నాలుగు పథకాలకు వేర్వేరుగా కేటాయింపులుంటే నిధులు పెరిగేవని ఆర్థికవేత్తల అభిప్రాయం.

బడ్జెట్​లో కోతలు..

ఎస్సీ, ఎస్టీ వర్గాల బాలికా విద్యను ప్రోత్సహించడానికి, ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేందుకు ఉద్దేశించిన 'సెకండరీ విద్య కోసం బాలికల ప్రోత్సాహక జాతీయ పథకానికి' గత ఏడాది ప్రతిపాదించిన బడ్జెట్‌ రూ.110 కోట్ల నుంచి కోటి రూపాయలకు తగ్గిపోయింది. పాఠశాల స్థాయిలో అత్యధిక నిధులను బాలికల విద్య కోసం ఖర్చు చేసే సమగ్ర శిక్షా పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో గత సంవత్సరం ప్రతిపాదించిన రూ.38,750.50 కోట్ల నుంచి రూ.31,300.16 కోట్లకు తగ్గించారు. మహిళలు, పిల్లల పోషకాహారానికి కేటాయింపుల్లో 27 శాతం కోత పడింది. మరోవైపు ఈ బడ్జెట్లో గత ఏడాది వాస్తవ కేటాయింపులను పక్కన పెట్టి కొవిడ్‌ దృష్ట్యా సవరించిన కేటాయింపులతో పోలుస్తూ మభ్యపెట్టారనే విమర్శలున్నాయి.

కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలి..

బాలికలపై కొనసాగుతున్న దుర్విచక్షణను తొలగించి స్వశక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వాటికి సరిపడా బడ్జెట్‌ కేటాయింపులూ జరగాలి. కొంతకాలంగా బాలురతో సమానంగా బాలికలు రాణించగలగడానికి కారణం- విద్యావకాశాలతోపాటు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనాలే. బడ్జెట్‌ కేటాయింపులతోనే ఇది సాధ్యమైంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం బాలికా సంక్షేమ పథకాల హేతుబద్ధీకరణ పేరిట నిధులు తగ్గించడం ఆందోళనకరం. బాలికా విద్య విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బాలికల వికాసానికి ప్రత్యేక చొరవ తీసుకొని బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలి. పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు- హక్కులపై అవగాహన కల్పిస్తూ, ప్రణాళికాబద్ధంగా బాలికల వికాసానికి కృషిచేయాలి. సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ, వృత్తి, జీవన నైపుణ్యాలను పెంపొందించి ఆత్మవిశ్వాసం నింపాలి. బాలికల కోసం రూపొందించిన చట్టాలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేస్తేనే మార్పు సాధ్యం!

- జి.శ్యామల

ఇదీ చూడండి:మూగజీవాల పొట్ట నిండా ప్లాస్టిక్‌ వ్యర్థాలే!

బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మహక్కు. ఈ హక్కును భారతీయ సమాజంలో బాలురతో సమానంగా బాలికలు పొందలేకపోతున్నారు. ఆడపిల్లను అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య బంధించడంతోపాటు లింగ విచక్షణ, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, భ్రూణ హత్యలు, హింస, వరకట్న సమస్య, పేదరికం, రక్తహీనత, పోషకాహార లోపం తదితర అంశాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తరవాత 30 శాతం, పదో తరగతి తరవాత 57 శాతం బాలికలు బడి మానేస్తున్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య కరోనా వల్ల మరింత పెరిగినట్లు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఆన్​లైన్ విద్య అందకుండా..
కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతపడటంతో చేపట్టిన 'ఆన్‌లైన్‌ విద్య' ప్రభావం బాలురతో పోలిస్తే బాలికలపై తీవ్రంగా పడి, డిజిటల్‌ అంతరాలకు దారి తీసింది. ఇంట్లో చదువు కోసం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ వంటి ఉపకరణాలను ఇవ్వడంలో బాలికల కంటే అబ్బాయిలకే ప్రాధాన్యమిచ్చారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఒక విద్యా సంబంధ సర్వేలో కోటి మంది బాలికలు బడి మానేసే అవకాశం ఉందని వెల్లడైంది. 37 శాతం అబ్బాయిలతో పోలిస్తే కేవలం 26 శాతం బాలికలే ఆన్‌లైన్‌ అధ్యయనాల కోసం స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాల సదుపాయాన్ని కలిగి ఉన్నారని, 71 శాతం బాలికలు ఇంట్లో, ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో కూడా ఇంటి పని చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, ఇది కేవలం 38 శాతం బాలురపై మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. మరోవైపు కుటుంబ పరిస్థితులు దిగజారడం వల్ల బాలికలు బాలకార్మికులుగా మారడం సహా బాల్య వివాహాలూ పెరిగాయి. అంతిమంగా బాలికల భద్రత, సంరక్షణ మరింత ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ ఏడాది కేటాయింపులేం లేవు..

ఇలాంటి పరిస్థితుల్లో బాలికల విద్యా వికాసానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యావేత్తలు అభిలషించినా, వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. లింగపరమైన దుర్విచక్షణను తొలగిస్తూ బాలికల నిష్పత్తిని పెంచేందుకు తోడ్పడే 'బేటీ బచావో, బేటీ పడావో' పథకం- బాలికలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఉన్నత విద్యాభ్యాసానికి చేయూతనిస్తుంది. ఇందులో ఇప్పటికే పలు ఇతర పథకాలను విలీనం చేశారు. ఈ పథకానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండేవి. ఈ ఏడాది ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం గమనార్హం. దీనికి బదులుగా, 'ప్రధానమంత్రి మాతృ వందన', 'మహిళాశక్తి కేంద్ర పరిశోధన' వంటి ఇతర పథకాలతో పాటు 'బేటీ బచావో- బేటీ పడావో'ను 'సమర్త్య యోజన' కింద కలిపి, ఉమ్మడిగా రూ.2,522 కోట్లు కేటాయించారు. ఈ నాలుగు పథకాలకు వేర్వేరుగా కేటాయింపులుంటే నిధులు పెరిగేవని ఆర్థికవేత్తల అభిప్రాయం.

బడ్జెట్​లో కోతలు..

ఎస్సీ, ఎస్టీ వర్గాల బాలికా విద్యను ప్రోత్సహించడానికి, ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేందుకు ఉద్దేశించిన 'సెకండరీ విద్య కోసం బాలికల ప్రోత్సాహక జాతీయ పథకానికి' గత ఏడాది ప్రతిపాదించిన బడ్జెట్‌ రూ.110 కోట్ల నుంచి కోటి రూపాయలకు తగ్గిపోయింది. పాఠశాల స్థాయిలో అత్యధిక నిధులను బాలికల విద్య కోసం ఖర్చు చేసే సమగ్ర శిక్షా పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో గత సంవత్సరం ప్రతిపాదించిన రూ.38,750.50 కోట్ల నుంచి రూ.31,300.16 కోట్లకు తగ్గించారు. మహిళలు, పిల్లల పోషకాహారానికి కేటాయింపుల్లో 27 శాతం కోత పడింది. మరోవైపు ఈ బడ్జెట్లో గత ఏడాది వాస్తవ కేటాయింపులను పక్కన పెట్టి కొవిడ్‌ దృష్ట్యా సవరించిన కేటాయింపులతో పోలుస్తూ మభ్యపెట్టారనే విమర్శలున్నాయి.

కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలి..

బాలికలపై కొనసాగుతున్న దుర్విచక్షణను తొలగించి స్వశక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వాటికి సరిపడా బడ్జెట్‌ కేటాయింపులూ జరగాలి. కొంతకాలంగా బాలురతో సమానంగా బాలికలు రాణించగలగడానికి కారణం- విద్యావకాశాలతోపాటు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనాలే. బడ్జెట్‌ కేటాయింపులతోనే ఇది సాధ్యమైంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం బాలికా సంక్షేమ పథకాల హేతుబద్ధీకరణ పేరిట నిధులు తగ్గించడం ఆందోళనకరం. బాలికా విద్య విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బాలికల వికాసానికి ప్రత్యేక చొరవ తీసుకొని బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలి. పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు- హక్కులపై అవగాహన కల్పిస్తూ, ప్రణాళికాబద్ధంగా బాలికల వికాసానికి కృషిచేయాలి. సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ, వృత్తి, జీవన నైపుణ్యాలను పెంపొందించి ఆత్మవిశ్వాసం నింపాలి. బాలికల కోసం రూపొందించిన చట్టాలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేస్తేనే మార్పు సాధ్యం!

- జి.శ్యామల

ఇదీ చూడండి:మూగజీవాల పొట్ట నిండా ప్లాస్టిక్‌ వ్యర్థాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.