ETV Bharat / jagte-raho

అదనపు కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ధర్నా

ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ ఏడాదిన్నర వరకు తనతో ఉండి... అదనపు కట్నం కోసం మరో వివాహానికి సిద్ధపడ్డ ప్రియుని ఇంటి ముందు మహిళ ఆందోళనకు దిగిన ఘటన నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Oct 28, 2020, 9:21 PM IST

woman protest for justice against her husband at nagarkurnool
అదనపు కట్నం కోసం మరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ధర్నా

నాగర్​కర్నూలుకు చెందిన రేష్మా, శివుడు ఏడాదిన్నర క్రితం యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్​లో జీవనం సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్​ కారణంగా సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు మరొక అమ్మాయితో పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేశారు.

విషయం తెలుసుకున్న రేష్మా... 15 రోజుల క్రితం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి తమ పెళ్లి విషయం తెలిపింది. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చివరకి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

నాగర్​కర్నూలుకు చెందిన రేష్మా, శివుడు ఏడాదిన్నర క్రితం యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్​లో జీవనం సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్​ కారణంగా సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు మరొక అమ్మాయితో పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేశారు.

విషయం తెలుసుకున్న రేష్మా... 15 రోజుల క్రితం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి తమ పెళ్లి విషయం తెలిపింది. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చివరకి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

ఇదీ చదవండిః 'అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.