ETV Bharat / jagte-raho

కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇంకా వారం రోజుల్లో పంట చేతికోస్తుందనుకున్న రైతు సంతోషం ఆవిరైంది. అన్యం పుణ్యం ఎరుగని అన్నదాత పొలానికి నిప్పుపెట్టారు దుండగులు. నాగర్​కర్నూల్​ జిల్లా ఊరుకొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఎకరా పంటకు నిప్పంటించారు. చేతికొచ్చిన కందిపంట కళ్లముందే దగ్ధమవుతుంటే రైతన్న ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 9, 2020, 10:41 PM IST

Unidentified persons set fire to the sesame crop in nagar kurnool dist
కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

నాగర్​కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఎకరా కందిపంటకు నిప్పుపెట్టారు గుర్తుతెలియని దుండగులు. చిన్న బాలయ్య అనే రైతు తన ఎకరా విస్తీర్ణంలో కందిపంటను సాగుచేశారు. మరో వారం రోజుల్లో పంట చేతికోస్తుందనుకునే లోగా మంటల్లో కాలి బూడిదైంది.

కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

చేతికొచ్చిన పంట కళ్లముందే దగ్ధమవుతుంటే రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిప్పుపెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. కష్టపడి పండించిన పంట మంటల్లో కాలిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం.. రూ.1.20 లక్షలు నష్టం

నాగర్​కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఎకరా కందిపంటకు నిప్పుపెట్టారు గుర్తుతెలియని దుండగులు. చిన్న బాలయ్య అనే రైతు తన ఎకరా విస్తీర్ణంలో కందిపంటను సాగుచేశారు. మరో వారం రోజుల్లో పంట చేతికోస్తుందనుకునే లోగా మంటల్లో కాలి బూడిదైంది.

కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

చేతికొచ్చిన పంట కళ్లముందే దగ్ధమవుతుంటే రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిప్పుపెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. కష్టపడి పండించిన పంట మంటల్లో కాలిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం.. రూ.1.20 లక్షలు నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.