ETV Bharat / jagte-raho

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు - తల్లి మందలించిందని పారిపోయిన బాలుడు

ఆన్​లైన్ తరగతులను అశ్రద్ధ చేస్తున్నాడని కుమారుడిని తల్లి మందలించడం వల్ల భవిత్ అనే బాలుడు ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు
తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు
author img

By

Published : Sep 30, 2020, 10:09 PM IST

మహబూబ్ నగర్​కు చెందిన మహేందర్, సంతోషి దంపతులు హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీ నాలుగో ఫేజ్​లో నివాసముంటున్నారు. మహేందర్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. వీరి కుమారుడు భవిత్ (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ఆన్​లైన్​ తరగతులను భవిత్ నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి సంతోషి మందలించింది. దీంతో కుమారుడు 29న ఉదయం 11 గంటలకు ఇంటినుంచి చెప్పకుండా వెళ్లిపోయినట్లు సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు. తెలిసిన అంతటా గాలించినా తల్లిదండ్రులకు ఆచూకీ లభించకపోవడం వల్ల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మహబూబ్ నగర్​కు చెందిన మహేందర్, సంతోషి దంపతులు హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీ నాలుగో ఫేజ్​లో నివాసముంటున్నారు. మహేందర్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. వీరి కుమారుడు భవిత్ (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ఆన్​లైన్​ తరగతులను భవిత్ నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి సంతోషి మందలించింది. దీంతో కుమారుడు 29న ఉదయం 11 గంటలకు ఇంటినుంచి చెప్పకుండా వెళ్లిపోయినట్లు సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు. తెలిసిన అంతటా గాలించినా తల్లిదండ్రులకు ఆచూకీ లభించకపోవడం వల్ల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నేరెడ్‌మెట్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.