ETV Bharat / jagte-raho

మూడో రోజు విచారణ.. నగేశ్​ బ్యాంకు లాకర్​ తెరిచే అవకాశం

author img

By

Published : Sep 23, 2020, 12:39 PM IST

నర్సాపూర్​ లంచం కేసులో అనిశా అధికారులు మూడో రోజు విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు నగేశ్​ బినామీ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. కీలక పత్రాలు ఉన్న నగేశ్ లాకర్​ను ఈ రోజు తెరిచే అవకాశం ఉంది.

third day acb investigation in narsapur bribe case
మూడో రోజు విచారణ.. నగేశ్​ బ్యాంకు లాకర్​ తెరిచే అవకాశం

మెదక్ జిల్లా నర్సాపూర్​ లంచం కేసులో నగేశ్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు... వాటి గురించి నగేశ్​ను ప్రశ్నిస్తున్నారు. నగేశ్ బినామీలను అనిశా ప్రధాన కార్యాలయానికి పిలిపించిన అధికారులు... వివరాలు సేకరిస్తున్నారు. బోయిన్​పల్లి ఆంధ్రా బ్యాంకులో ఉన్న నగేశ్ లాకర్​ను ఈ రోజు తెరిచే అవకాశం ఉంది. అందులో బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

75 లక్షలకు సంబంధించి 5 ఎకరాల భూమిని బినామీ జీవన్ గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించున్న నగేశ్... 40లక్షల నగదును ఎక్కడ ఉంచాడని ఆరా తీస్తున్నారు. బాధితుడు లింగమూర్తి వద్ద నగేశ్... అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి పేరు పదేపదే ప్రస్తావించినందున... దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన పాత్ర ఏమేర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్​తో పాటు మరో ఇద్దరిని అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్​ లంచం కేసులో నగేశ్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు... వాటి గురించి నగేశ్​ను ప్రశ్నిస్తున్నారు. నగేశ్ బినామీలను అనిశా ప్రధాన కార్యాలయానికి పిలిపించిన అధికారులు... వివరాలు సేకరిస్తున్నారు. బోయిన్​పల్లి ఆంధ్రా బ్యాంకులో ఉన్న నగేశ్ లాకర్​ను ఈ రోజు తెరిచే అవకాశం ఉంది. అందులో బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

75 లక్షలకు సంబంధించి 5 ఎకరాల భూమిని బినామీ జీవన్ గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించున్న నగేశ్... 40లక్షల నగదును ఎక్కడ ఉంచాడని ఆరా తీస్తున్నారు. బాధితుడు లింగమూర్తి వద్ద నగేశ్... అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి పేరు పదేపదే ప్రస్తావించినందున... దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన పాత్ర ఏమేర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్​తో పాటు మరో ఇద్దరిని అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.