హైదరాబాద్ బోరబండలోని రెండు ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. బోరబండ సైట్2లోని అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు అదే ఆవరణలో ఉన్న మరో ఆలయంలో ఈ చోరీ జరిగింది. ఉదయం ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న ఆలయ అధికారులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
విషయం తెలుసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు అరకిలోకుపైగా వెండి, 5 తులాల బంగారాన్ని దోచుకున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష