తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని శ్రీనివాస్కు కరోనా సోకడం వల్ల ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పది రోజులుగా ఇంట్లో ఎవరు ఉండడం లేదు.
తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి ... బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు శ్రీనివాస్కు సమాచారం అందించారు. శ్రీనివాస్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అలీని ఫాలో అయిన దొంగలు.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!