ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులో చోరీ జరిగింది. సహకార బ్యాంకు లాకర్లో 61 గ్రాముల బంగారం మాయం కలకలం రేపింది. గుడివాడ రాజేంద్రనగర్కు చెందిన గుత్తా విజయలక్ష్మి.. తన తండ్రి కొల్లి నాగేశ్వరరావు కలిసి.. వేలేరు కోఆపరేటివ్ బ్యాంకు లాకర్లో బంగారాన్ని దాచుకున్నారు.
బ్యాంకు సిబ్బంది యార్లగడ్డ మదన్మోహన్తో చేతులు కలిపిన విజయలక్ష్మి కుమారుడు గుత్తా సాయిహిరన్ చౌదరి.. తాత నాగేశ్వరరావు నుంచి దొడ్డిదారిలో తీసుకున్న తాళంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తల్లి విజయలక్ష్మికి తెలియకుండా లాకర్లోని బంగారాన్ని కాజేశాడు. దీనిపై విజయలక్ష్మి హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాయిహిరన్ చౌదరి ముత్తూట్లో తనఖా పెట్టి కొంత మొత్తాన్ని జల్సాలకు ఖర్చు చేసినట్లు గుర్తించారు. తనయుడితో పాటు బ్యాంకు ఉద్యోగి మదన్మోహన్ను అరెస్టు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: జగిత్యాల యాసిడ్ దాడి కేసులో ముగ్గురు అరెస్ట్