ETV Bharat / jagte-raho

ఫొటోలు, వీడియోలతో విద్యార్థినిని బ్లాక్​మెయిల్​ చేసిన కేటుగాళ్లు అరెస్ట్​

author img

By

Published : Sep 17, 2020, 1:20 PM IST

పరిచయం లేనివారితో ఫొటోలు ... మైత్రి పేరుతో మితిమీరిన చనువు.. ఇక్కట్లు పాలుచేస్తోందని ఎందరు చెబుతున్నా కొందరి తీరు మారడం లేదు. ఇన్​స్టాగ్రాంలో పరిచయం... టిక్​టాక్​లో వీడియోలు... సరదా సరదా ఫొటో షూట్లు వెరసి ఓ బాలికను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. బాలిక ఫొటోలు, వీడియోలతో బ్లాక్​మెయిల్​ చేస్తూ నాలుగు లక్షలు కాజేసిన ముగ్గిరిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.

ఫోటోలు, వీడియోలతో విద్యార్థినిని బ్లాక్​మెయిల్​ చేసిన కేటుగాళ్లు అరెస్ట్​
ఫోటోలు, వీడియోలతో విద్యార్థినిని బ్లాక్​మెయిల్​ చేసిన కేటుగాళ్లు అరెస్ట్​

ఓ బాలిక ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్​మెయిల్​ చేస్తూ ఆమె నుంచి నాలుగు లక్షల రూపాయలు కాజేసిన ముగ్గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.

అసలు ఏమైందంటే...

కరోనా ప్రభావం వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ సూచనలతో ఇటీవలే అన్​లైన్​ క్లాసులు ప్రారంభం కావడం వల్ల జీడిమెట్ల అయోధ్యనగర్​కు చెందిన ఓ బాలికకు ఆమె తల్లిదండ్రులు ఫోన్​ కొనిచ్చారు. ఆ బాలిక ఫోన్​లో ఇన్​స్ట్రాగ్రాం వాడడం ప్రారంభించింది. అందులో ఆమెకు ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వారంతా కలిసి తరుచూ టిక్​టాక్ వీడియోలు, ఫొటో షూట్లు చేశారు.

కొంతకాలానికి వారి అసలు రూపం బయటపడింది. బాలిక ఫొటోలు, వీడియోలు తీసి వాటితో ఆమెను బ్లాక్​మెయిల్​ చేయడం ప్రారంభించారు. ఆమె నుంచి పలు దఫాలుగా నగదు, గిఫ్ట్​ల రూపంలో సుమారు నాలుగు లక్షలు వరకు కాజేశారని పోలీసులు తెలిపారు.

ఎలా బయటపడిందంటే..

కొన్నాళ్లుగా ఇంట్లో డబ్బులు మాయం అవుతున్నట్లు గమనించిన తల్లిదండ్రులు బాలికను గమనించారు. ఈ నెల 14న ఆమె వద్దకు బైక్ కోసం వచ్చిన ముగ్గురు యువకులను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పదోతరగతి మెటీరియల్​ కోసం వచ్చామని తెలిపారు. బాలికను గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. రెండు నెలలుగా సుమారు 4 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్లు వివరించింది.

బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు చెప్పారని జీడిమెట్ల ఇన్​స్పెక్టర్​ బాలరాజు వెల్లడించారు.

ఇదీ చూడండి: బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్​

ఓ బాలిక ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్​మెయిల్​ చేస్తూ ఆమె నుంచి నాలుగు లక్షల రూపాయలు కాజేసిన ముగ్గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.

అసలు ఏమైందంటే...

కరోనా ప్రభావం వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ సూచనలతో ఇటీవలే అన్​లైన్​ క్లాసులు ప్రారంభం కావడం వల్ల జీడిమెట్ల అయోధ్యనగర్​కు చెందిన ఓ బాలికకు ఆమె తల్లిదండ్రులు ఫోన్​ కొనిచ్చారు. ఆ బాలిక ఫోన్​లో ఇన్​స్ట్రాగ్రాం వాడడం ప్రారంభించింది. అందులో ఆమెకు ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వారంతా కలిసి తరుచూ టిక్​టాక్ వీడియోలు, ఫొటో షూట్లు చేశారు.

కొంతకాలానికి వారి అసలు రూపం బయటపడింది. బాలిక ఫొటోలు, వీడియోలు తీసి వాటితో ఆమెను బ్లాక్​మెయిల్​ చేయడం ప్రారంభించారు. ఆమె నుంచి పలు దఫాలుగా నగదు, గిఫ్ట్​ల రూపంలో సుమారు నాలుగు లక్షలు వరకు కాజేశారని పోలీసులు తెలిపారు.

ఎలా బయటపడిందంటే..

కొన్నాళ్లుగా ఇంట్లో డబ్బులు మాయం అవుతున్నట్లు గమనించిన తల్లిదండ్రులు బాలికను గమనించారు. ఈ నెల 14న ఆమె వద్దకు బైక్ కోసం వచ్చిన ముగ్గురు యువకులను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పదోతరగతి మెటీరియల్​ కోసం వచ్చామని తెలిపారు. బాలికను గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. రెండు నెలలుగా సుమారు 4 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్లు వివరించింది.

బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు చెప్పారని జీడిమెట్ల ఇన్​స్పెక్టర్​ బాలరాజు వెల్లడించారు.

ఇదీ చూడండి: బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.