ETV Bharat / jagte-raho

రమేశ్ హత్యకు ఆ బంధమే కారణం: డీసీపీ

author img

By

Published : Dec 21, 2020, 10:55 PM IST

ఈ నెల 18న హత్యకు గురైన రమేష్ అనే యువకుని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పెద్దపల్లి డీసీపీ పేర్కొన్నారు. పథకం ప్రకారమే నిందితులు హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

the-extramarital-affair-reason-for-the-murder
వివాహేతర సంబంధమే దారుణహత్యకు దారి తీసింది

వివాహేతర సంబంధమే యువకుని దారుణహత్యకు దారి తీసిందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన రమేష్.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల శివారులో ఈ నెల 18న రమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. తన బంధువుల ఇంటికి రమేష్​ వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు.. అతడిని హతమార్చాలనే ఉద్దేశంతో అదే రోజు పోతురాజుల రాజు, శ్రీను, వేణు కారులో మద్దిరాలకు వచ్చారు. పొలంలో పనిచేస్తున్న రమేశ్​పై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కారుతో పాటు హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

వివాహేతర సంబంధమే యువకుని దారుణహత్యకు దారి తీసిందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన రమేష్.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల శివారులో ఈ నెల 18న రమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. తన బంధువుల ఇంటికి రమేష్​ వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు.. అతడిని హతమార్చాలనే ఉద్దేశంతో అదే రోజు పోతురాజుల రాజు, శ్రీను, వేణు కారులో మద్దిరాలకు వచ్చారు. పొలంలో పనిచేస్తున్న రమేశ్​పై కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కారుతో పాటు హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:విద్యార్థిని అదృశ్యం: మౌఖిక ఎటెళ్లినట్టు.. ఏమైనట్టు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.