ETV Bharat / jagte-raho

పనిలో వేధింపులు.. సీనియర్​ను చంపిన జూనియర్.! - supervisor murder news

పనిలో వేధిస్తున్నాడని సూపర్​వైజర్​ను జూనియర్​ ​హత్య చేసిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

murder, supervisor, kurnool
హత్య, కర్నూలు, సూపర్​వైజర్​
author img

By

Published : Jan 14, 2021, 5:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామం వద్ద ఉత్తర ఫుడ్స్ కంపెనీలో పోతి మహేశ్​ నాయక్​ సూపర్​వైజర్​గా పని చేస్తున్నాడు. అతనికి జూనియర్​గా రమేశ్​ను నియమించారు. ఈ క్రమంలో పని విషయంలో నిత్యం వేధిస్తున్నాడని.. మహేశ్​ను రమేశ్​ చంపేశాడు.

రమేశ్..​ తన తమ్ముడు, సమీప బంధువులు ఇద్దరితో కలిసి ఈ నెల 2న మహేశ్​ ఇంటికి వెళ్లారు. అతనిపై వారు దాడి చేసి.. తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. పంచలింగాల వీఆర్వో దగ్గరకు వెళ్లి నిందితులు నేరం అంగీకరించారని వివరించారు. పోలీసులకు వీఆర్వో సమాచారం ఇవ్వటంతో.. వారిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామం వద్ద ఉత్తర ఫుడ్స్ కంపెనీలో పోతి మహేశ్​ నాయక్​ సూపర్​వైజర్​గా పని చేస్తున్నాడు. అతనికి జూనియర్​గా రమేశ్​ను నియమించారు. ఈ క్రమంలో పని విషయంలో నిత్యం వేధిస్తున్నాడని.. మహేశ్​ను రమేశ్​ చంపేశాడు.

రమేశ్..​ తన తమ్ముడు, సమీప బంధువులు ఇద్దరితో కలిసి ఈ నెల 2న మహేశ్​ ఇంటికి వెళ్లారు. అతనిపై వారు దాడి చేసి.. తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. పంచలింగాల వీఆర్వో దగ్గరకు వెళ్లి నిందితులు నేరం అంగీకరించారని వివరించారు. పోలీసులకు వీఆర్వో సమాచారం ఇవ్వటంతో.. వారిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ముగిసిన అఖిలప్రియ కస్టడీ... చంచల్‌గూడ జైలుకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.