ETV Bharat / jagte-raho

దా'రుణం'... ఆరువేల అప్పు తీర్చలేక బలవన్మరణం - యాదగిరిగుట్టలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదగిరి గుట్టకు చెందిన గ్యాద వెంకటేష్ సోమవారం మృతి చెందాడు. అవసరాల నిమిత్తం రూ. ఆరువేల అప్పు చేసిన వెంకటేష్​.. బాకీ చెల్లించలేక పెట్రోల్​ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

sanitation worker died in yadagirigutta
యాదగిరి గుట్ట, పారిశుద్ధ్య కార్మికుడు మృతి
author img

By

Published : Jan 18, 2021, 1:22 PM IST

Updated : Jan 18, 2021, 2:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన గ్యాద వెంకటేష్​(42) మృతి చెందాడు. ఉప్పల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.

వెంకటేష్​.. యాదగిరిగుట్ట పురపాలిక సంఘంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య వద్ద రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొమురయ్య.. తన భర్తను అప్పు తీర్చాలని వేధించినట్లు మృతుడి భార్య పేర్కొంది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అందుకే తన భర్త బలవన్మరణం చేసుకున్నాడని విలపించింది.

సంబంధిత వార్త: రూ.6వేల అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని గుట్ట ఎస్సై రాజు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైన్స్​ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన గ్యాద వెంకటేష్​(42) మృతి చెందాడు. ఉప్పల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.

వెంకటేష్​.. యాదగిరిగుట్ట పురపాలిక సంఘంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య వద్ద రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొమురయ్య.. తన భర్తను అప్పు తీర్చాలని వేధించినట్లు మృతుడి భార్య పేర్కొంది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అందుకే తన భర్త బలవన్మరణం చేసుకున్నాడని విలపించింది.

సంబంధిత వార్త: రూ.6వేల అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని గుట్ట ఎస్సై రాజు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైన్స్​ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది

Last Updated : Jan 18, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.