ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... యువకుడు మృతి

author img

By

Published : Dec 2, 2020, 9:12 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ వద్ద ఈ ఉదయం జరిగిన దుర్ఘటన మరవకముందే మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అక్కడ జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఉరేళ్ల గ్రామానికి చెందిన సునీల్​గా గుర్తించారు.

RTC bus attack two wheeler one person died on the spot
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు....యువకుడు మృతి

హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామ స్టేజ్​ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కిలోమీటర్​ దూరంలోనే ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

మృతుడు మండలంలోని ఉరేళ్ల గ్రామానికి చెందిన సునీల్​గా గుర్తించారు. అతను గచ్చిబౌలిలోని కాంటినెంటల్​ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అతనొక్కడే సంతానం కావడంతో కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారున్ని కోల్పోయామని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి:అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..

హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామ స్టేజ్​ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కిలోమీటర్​ దూరంలోనే ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

మృతుడు మండలంలోని ఉరేళ్ల గ్రామానికి చెందిన సునీల్​గా గుర్తించారు. అతను గచ్చిబౌలిలోని కాంటినెంటల్​ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అతనొక్కడే సంతానం కావడంతో కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారున్ని కోల్పోయామని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి:అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.