ETV Bharat / jagte-raho

మోటకొండూర్ పోలీస్​స్టేషన్​ ఎదుట ధర్నా

author img

By

Published : Jan 13, 2021, 8:07 AM IST

మోటకొండూర్ పోలీస్​స్టేషన్​ ఎదుట రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం కాశీం నిరసన చేపట్టారు. తమపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్​ చేశారు.

protest in front of Motakondur police station in yadadri bhavanagiri district
మోటకొండూర్ పోలీస్​స్టేషన్​ ఎదుట ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ పోలీస్​స్టేషన్​ ఎదుట రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం కాశీం ధర్నా నిర్వహించారు. మండలంలోని చాడ గ్రామానికి చెందిన గోపాల్, గత నవంబర్ 30న తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.

నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కాశీం డిమాండ్​ చేశారు. ఇకనైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఈ అంశంపై స్పందించిన ఎస్సై.. కేసు ఇదివరకే నమోదు చేశామన్నారు. దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రూపాయి పలకని టమాట ధర.. రోడ్డుపై పడేసి రైతుల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ పోలీస్​స్టేషన్​ ఎదుట రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం కాశీం ధర్నా నిర్వహించారు. మండలంలోని చాడ గ్రామానికి చెందిన గోపాల్, గత నవంబర్ 30న తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.

నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కాశీం డిమాండ్​ చేశారు. ఇకనైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఈ అంశంపై స్పందించిన ఎస్సై.. కేసు ఇదివరకే నమోదు చేశామన్నారు. దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రూపాయి పలకని టమాట ధర.. రోడ్డుపై పడేసి రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.