జిల్లా కేసముద్రం మండలంలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
గత నెల జులై 2న కేసముద్రం మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ బంగారం దుకాణానికి నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి కిరణ్, మధ్యప్రదేశ్ భూపాల్కు చెందిన షబ్బీర్ వెండి పట్టీలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వాటిని చూస్తూ యజమాని దృష్టిని మరల్చి 12 తులాల బంగారు కడ్డీ దొంగిలించారు.
మరో కేసులో కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రాంప్రసాద్ , అదే గ్రామానికి చెందిన బిచ్చగాడు కిన్నెర యాదగిరి ఇనుప పెట్టె తాళం పగలకొట్టి అందులో ఉన్న నగదు 43 వేల రూపాయలు, 15 తులాల వెండి ( 7500 రూపాయల విలువ చేసేవి )ని దొంగలించాడు. రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి- బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!