హైదరాబాద్ తుకారాం గేటు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని సంగీత్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు.
ఈస్ట్ మారేడ్పల్లి ప్రాంతానికి చెందిన నర్సింగ్ కారులో వెళ్తూ తుకారాం గేట్కు చెందిన రాకేశ్ను సంగీత్ కూడలి వద్ద ఢీకొట్టాడు. సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కారు డ్రైవర్ గందరగోళానికి గురయ్యాడని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫలితంగా ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు.
- ఇదీ చూడండి ద్విచక్రవాహనం, ఓమిని ఢీ... ఒకరు మృతి